DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ లో ఉండాలంటే జై శ్రీరామ్, వందేమాతరం అనాల్సిందే: రాజాసింగ్

*హిందూ డిజిటల్ వేదిక గా భాగ్యనగరం నుంచి హిందువులకు పిలుపు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 29, 2022 (డిఎన్ఎస్):* భారత్ లో నివాసం ఉండాలంటే జై శ్రీరామ్, వందే మాతరం అని తప్పకుండా అనాల్సిందేనని హిందూ టైగర్ గా ప్రఖ్యాతిగాంచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

పిలుపునిచ్చారు. భాగ్యనరంగం లో నిర్వహించిన డిజిటల్ హిందూ సదస్సులో మాట్లాడుతూ హిందువులు ఎవ్వరికి వ్యతిరేకంకాదని, తమని తాము రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు. హిందూ జాతిని నాశనం చేసేందుకు గతపాలకులు, కుహనావాదులు విశ్వ ప్రయత్నం చేసారని, అయినప్పడికి సనాతన హిందూ ధర్మం చాలా గొప్పది

కావడంతో యువతలో చైతన్యం కల్గించాడన్నారు. ఇటీవల కాలంలో లక్షలాదిగా హిందువులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, ప్రతి రోజూ పట్టపగలే హత్యలు చేస్తున్నారన్నారు.  ఇలా దాడుల నుంచి స్వీయ రక్షణ చేసుకోవాలంటే. .ప్రతి ఒక్క యువతి, యువకుడు మార్షల్ ఆర్ట్స్ తప్పని సరిగా నేర్చుకోవాలన్నారు. ఇటీవల కాలంలో హిందువులపై జరుగుతున్నా

హత్యాకాండలు, లక్షలాదిగా గో హత్యలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మేము పూజించే గోమాతను చంపుతున్నావు. . .నీకు విలువ ఎందుకు ఇవ్వాలి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దేశం పూర్తిగా సనాతన ధర్మంతోను, విలువలతోనూ నిండి ఉందని, ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు తప్పని సరిగా జై శ్రీరామ్ అనవలసిందేనని, భారత మాతను గౌరవిస్తూ వందే మాతరం అని

పలకాల్సిందేన్నారు. ఈ దేశపు చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. 

భారత దేశంలో 100 ఏళ్ళ క్రితం వరకూ నిర్మించిన ఆలయాలు త్రవ్వుదాం, కచ్చితంగా అక్కడ రామాలయంలో, శివాలయంలో, కృష మందిరంలో వెలుగు చూస్తుందన్నారు. గత మూడు నెలల నుంచి తాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, ప్రతి దేవాలయాన్ని రక్షించుకునే శక్తి

హిందువులకే ఉందన్నారు. 
కుహనా శక్తులు, రానున్న కాలం లో హిందువులపై మరిన్ని దాడులు జరుగుతాయని, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే. . .తిరుగుబాటు తప్పదన్నారు. మనం ఎవరి జోలికి వెళ్లొద్దు, మన జోలికి వస్తే మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోవద్దు అని పిలుపునిచ్చారు. 

తప్పుడు సమాచారంతో చరిత్రలు:.

.

చరిత్ర పుస్తకాల్లో ఫలానా వాళ్ళు ఈ మసీదులు కట్టారు, అవి కట్టారు అని మాత్రమే చెప్తున్నారు తప్ప, ,. , ఏ హిందు దేవాలయాన్ని కూల్చి ఆ మసీదు ని కట్టారో చెప్పలేదని, అంతకు ముందు అక్కడ వేలాది సంవత్సరాలుగా పూజలు అందుకున్న హిందూ దేవీదేవతలు పేర్లు ఎందుకు చెప్పలేదన్నారు. వాటిని కూల్చి మసీదులు కట్టి, ఇప్పుడు నిరసనలు

చేస్తున్నారన్నారు. ముగల్స్ ఈ దేశానికి రాకముందు ఈ దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయో చెప్పాలన్నారు. బలవంతపు మతమార్పిళ్లు చేసి, ఆలయాలు కూల్చి మసీదులు కట్టారన్నారు. దీన్ని కచ్చితంగా పునరుద్ధరణ చెయ్యాల్సిన భాద్యత మనపై ఉందన్నారు. 

హిందు వ్యాపారుల వద్దే కొనండి. .

ఈ రోజు నుంచి ఏ చిన్న వస్తువు కొనాలన్నా. .

.నుదుటున బొట్టు పెట్టుకునే హిందువు వద్దే కొనాలని, తద్వారా వాళ్లకి ఆర్ధిక పరంగా బలం వస్తుందన్నారు. ఇదే సందేశాన్ని మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బాంధవులు అందరికీ తెలియచేయాలన్నారు. అదే విధంగా ప్రతి హిందూ వ్యాపారి. . .తమ దుకాణం వద్ద తాము హిందువుని అని తెలిసే విధంగా జై శ్రీరామ్ బ్యానర్ లేదా పోస్టర్లు పెట్టాలన్నారు.

తద్వారా హిందువులకు అండగా నిలబడేందుకు అవకాశం కలుగుతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam