DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిద్ధూ మూస్ వాలా హత్యకు కేజ్రీవాల్, రాఘవ్ చద్దా లదే బాధ్యత: బీజేపీ

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం/ ఢిల్లీ , మే 29, 2022 (డిఎన్ఎస్):* పంజాబ్‌లో ప్రముఖ సింగర్, కాంగ్రెస్ యువనాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య కు పూర్తి భాద్యత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లదేనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి

డాక్టర్. సంబిత్ పాత్రా మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ పంజాబ్ లోని మాన్సా జిల్లాలో ఆదివారం అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటనకు ఢిల్లీ సీఎం క్రూరనిర్ణయాలే కారణమన్నారు. పంజాబ్ లో శనివారం 400 మంది ప్రముఖుల సెక్యూరిటీ తొలగించడమే కాకుండా వాళ్ళ జాబితాను బహిరంగంగా పంజాబ్

ప్రభుత్వం ప్రకటించడం అత్యంత దారుణమన్నారు. ఈ క్రూర చర్య కారణంగానే ఆదివారం పంజాబ్‌లో ని మాన్సా జిల్లాలో మూసవాలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారన్నారు. రాఘవ్ చెడ్డ 45 మంది సెక్యూరిటీ తో తిరుగుతుంటారని, అతని మూర్ఖపు నిర్ణయాల వల్ల దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటన కు మూస వాలా కుటుంబానికి క్షమాపణ చెప్పడమే

కాకుండా ఈ ఘటనకు పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. 

పంజాబ్ ప్రభుత్వం ఆయనకు భద్రతను ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. బుల్లెట్ గాయాలతో సిద్ధూ మూస్ వాలా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 
గత ఏడాది డిసెంబర్‌లో 29 సంవత్సరాల ఈ యువ  గాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్ధూ మూస్ వాలాపై

దాడి చేసిన వారిని ఇంకా గుర్తించి అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ ఘటనను పంజాబ్ పోలీసులు ధృవీకరించారు. ప్రభుత్వం అతని భద్రతను తగ్గించిన 24 గంటలలోపే, లక్షలాది మంది అభిమానులతో మూస్ వాలాను పంజాబ్‌లోని మాన్సాలోని అతని పూర్వీకుల గ్రామానికి సమీపంలో ఆదివారం పట్టపగలు గ్యాంగ్‌స్టర్లు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. విలేకరుల

సమావేశంలో పంజాబ్ బిజెపి నేత సీర్సా మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు బాద్యుణ్ని చేస్తూ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి, విచారించాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam