DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లాస్టిక్ తయారీ సంస్థల పై బాన్ ఎందుకు విధించడం లేదు?

(DNS రిపోర్ట్: BV సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం) 

*విశాఖపట్నం, మే 29, 2022 (డిఎన్ఎస్):*  జూన్ నెల నుంచి విశాఖపట్నం లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పై నిషేధం విధిస్తున్నట్టు నగర కమిషనర్ ప్రకటించారు. ప్లాస్టిక్ వస్తువులు జనాన్ని వాడొద్దని, వాడితే జరిమానా తప్పదని చెప్పగలిగిన కమిషనర్, ప్లాస్టిక్

వస్తువులు తయారు చేస్తున్న సంస్థలకు మాత్రం యధేచ్చగా అనుమతులు జారీ చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్ లోకి వస్తేనే కదా వ్యాపారాలు అమ్మేది, జనం వాడేది. అసలు నిషేధం విధించవలసిన తయారీదారులకు వేళుసుబాటు కల్పించి, వాడకందార్ల పై నిషేధం విధించడం ద్వారా ఏ సందేశం ఇవ్వబోతున్నారు. 
ప్లాస్టిక్ లో 40 పిపిఎమ్ ల లోపు

ఉన్న వస్తువులను నిషేధం విధిస్తున్నట్టు గతంలోని కమిషనర్లు కూడా ఆర్భాటంగానే ప్రకటనలు చేశారు. తయారీదారుల ఒత్తిళ్లకు లొంగి చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరం అని జనానికి చెప్పే విధానాలను వాడడం మానేసి, జనంలో అవగాహనా పెంచడం మానేసి నేరుగా జరిమానా అంటే జనానికి ముఖ్యంగా చిన్నపాటి,

వీధి వ్యాపారులకు తెలిసేది ఎలా?
నేరుగా వాలంటీర్లకు గ్రూప్ ల ద్వారా ఆడియో సందేశం ఇస్తే. . ప్రచారం జరిగేది ఎలా?
ముందుగా జనంలో అవగాహనా పెంచవలసి ఉంది. ప్లాస్టిక్ వాడడం వలన కలిగే నష్ఠాలను, ప్రమాదాలను వివరిస్తే జనమే స్వచ్చందంగా ముందుకు వస్తారు. 
ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు చేసుకోకుండా నేరుగా జనం పై అధికార

దర్పాన్ని ప్రదర్శిస్తే  గతం లో పరిస్థితులే పునరావృతమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

విశాఖనగరం లో ఒరిస్సా, ఇతర ప్రాంతాల నుంచి ఈ విధమైన ప్లాస్టిక్ సామాగ్రి వస్తుప్పటికీ, కొన్ని యూనిట్లు నగర పరిధిలోనే ఉన్నట్టు సమాచారం. ముందస్తుగా ప్లాస్టిక్ వస్తువుల తయారీ దార్లను కట్టడి చేసి, ఆ పై వినియోగదారులకు జరిమానా లపై

యోచన చెయ్యవలసి ఉంది. అందరికి లోకువగా కనిపించే వినియోగదారులపైనే నేరుగా బ్రహ్మాస్త్రాలు విధిస్తే ప్రజల్లో అసహనం పెరిగిపోయే అవకాశం ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam