DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి కాశ్మీర్ వరకూ సంపత్ బైక్ రైడ్ ప్రారంభం

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

విశాఖపట్నం, మే 30, 2022 (డిఎన్ఎస్):  దాన్ ఫౌండేషన్ వైజాగ్ రీజియన్ లో కైలాసగిరి కళంజియ సమాఖ్య పరిధిలో ఎస్.ఐ జి నగర్ క్లస్టర్ లో సభ్యురాలిగా ఉన్న ఓమన కుమారుడు సంపత్, విశాఖపట్నం నుంచి కాశ్మీర్ వరకు *అవర్ ఎర్త్ అవర్ సాయిల్* నేలను రక్షిద్దాం అనే నినాదంతో బైక్ రైడ్ ఈ

రోజు ప్రారంభించారు. 
డిగ్రీ చదువుతున్న ఈ యువకునికి దాన్ ఫౌండేషన్ హ్యూమన్ ట్రస్ట్ నుంచి ఈ రైడ్ కి అవసరమైన ఆర్ధిక సహాయం అందించించింది. మొత్తం 20 రోజుల పాటు 8 వేల కిలోమీటర్లు హైదరాబాద్, నాగపూర్, సాగెర్, ఢిల్లీ, శ్రీనగర్, లెహ్, మనాలి మళ్లీ తిరుగు ప్రయాణం రైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం పౌర గ్రంధాలయంలో సమాఖ్య నాయకుల

సమక్షంలో ఈ రైడ్ ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో  సేవ్ సాయిల్ శ్రీనివాసరావు, ప్రోగ్రాం లీడరు డా. కె.రమాప్రభ,  సమాఖ్య నాయకులు ఉషారాణి, అరుణ, గౌరి, సరోజిని, శాంతకుమారి, వరలక్ష్మి, సిబ్బంది ధనలక్ష్మి, మురళి, పృథ్వి, రజని  పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam