DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చరిత్ర ని వక్రీకరిస్తే తస్మాత్ జాగ్రత్త, ఉండవల్లి కి శివశక్తి హెచ్చరిక

*గుళ్ళకి ఆస్తుల్లేక పొతే హిందూ గుళ్ళనే ప్రభుత్వం ఎందుకు లాక్కుంది?*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 31, 2022 (డిఎన్ఎస్):* సనాతన హిందూ సంప్రదాయ చరిత్రని వక్రీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని శివశక్తి సంస్థ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను హెచ్చరించింది. ఇటీవల

జరిగిన ప్రెస్ మీట్ లో అరుణ్ కుమార్ ఇస్లాం గురించి, భారత్ పై దండయాత్రలు చేసిన ముస్లిం పాలకుల గురించి మాట్లాడుతూ, వాళ్లంతా హిందూ దేవాలయాల ఉద్ధారకులు అని చెప్పడంపై శివశక్తి ప్రతినిధి కళ్యాణ్ చట్లపల్లి మండిపడ్డారు. ఈ ప్రెస్ మీట్ లో వెల్లడించిన అంశాలను ఒక్కొక్కటిగా ఖండిస్తూ కళ్యాణ్ చెంపదెబ్బకొట్టినంత పనీ చేశారు.

అరుణ్ కుమార్ చెప్పే చరిత్ర వక్రీకరణను ఖండిస్తూ శివశక్తి ఒక ప్రత్యేక వీడియో విడుదల చేసింది.

అరుణ్: సమాజాన్ని కాపాడడం కోసం ఇస్లాం పుట్టిందని, ప్రపంచానికి శాంతిని అందించేందుకు అందరిని కావలించుకోడానికే ఈ మతం అని చెప్పడంతో పాటు, అందరినీ కావలించుకునే మతంలోకి అహ్వాహించారన్నారు. 
కళ్యాణ్: అలా అయితే ఈ

దేశంలో లక్షలాది గా హిందువులపై ఊచకోత ఎందుకు జరిగింది? బలవంతంగా హిందువులను మతమార్పిడి ఎందుకు జరిగింది? కాశ్మీర్ లో నేటికీ హిందువులపై హత్య మారణహోమం ఎందుకు జరుగుతోందన్నారు. వాళ్ళు రాక ముందు ఈ దేశంలో హిందూ ధర్మం తప్పితే మరొకటి లేదని, ఇస్లాం లోకి బలవంతంగా బెదిరించి, ఇళ్లల్లో ఆడవాళ్లపై మానభంగాలు జరిపి, మతమార్పిళ్లు

చేసిన విషయం చరిత్రే చెప్తోందన్నారు. 

అరుణ్: హిందూ దేవాలయాల్లో ఎప్పుడూ ఆస్తులు గానీ, దానం గానీ, ఆదాయం గానీ లేవని, వాటిని నడపడం కోసమే ఔరంగజేబు లాంటివాళ్లు హిందూ దేవాలయాలకు కోట్లాది గా నగదు, వజ్రాలు లక్షల ఎకరాల భూములు ఆస్తులు ఇచ్చారన్నారు. 

కళ్యాణ్: అసలు ముస్లిం ఈ దేశానికి వచ్చిందే దేవాలయాలను

దోచుకోడానికేనని, అందిన కాడికి దోచుకుతిన్నాకా, అక్కడ విగ్రహాలను విశృంఖలంగా ధ్వంసం చేసి, అక్కడే దర్గాలు, మసీదులు కట్టారన్నారు. ప్రస్తుతం నేటికీ హిందూ ఆలయాలను రక్షించుకోవడం కోసం కోర్టుల్లో పోరాటం చెయ్యవలసిన దౌర్భాగ్య స్థితిలో హిందువులు ఉన్నారన్నారు. 

తిరుమల, విజయవాడ, తిరువనంతపురం, లాంటి వేలాది

దేవాలయాల్లో కోట్లాదిగా విలువల కల్గిన ఆభరణాలు, లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయని, అసలు దేవాలయాలకు కోట్లాదిగా ఆస్తులు ఉన్నాయి కనుకనే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖా కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే స్వాధీనం చేసుకుంది. అన్నీ తెలిసి ఉండి కూడా తప్పుడు అంశాలు చెప్తున్నదంటే ఇతను హిందూ ధర్మానికి బద్ద వ్యతిరేకిగా

మారాడన్నారు. హిందూ చరిత్రను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ జాతివాడు ఇంతకంటే ఇంకేమి గొప్పగా చెప్తాడన్నారు. 

హిందూ ముసుగులో ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడంటే. . .ఇతను మతమార్పిడి చెందాడని అనుమానం కలుగుతోందన్నారు. 

500 ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం కోట్లాది మంది హిందువులు పోరాటం

చేస్తున్న విషయం కూడా తెలియకుండా కబుర్లు చెప్తున్నా అరుణ్ కుమార్ కి అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీద్ కేసు విషయం తెలుసా లేదా అని ఎద్దేవా చేశారు. హిందూ చరిత్రను వక్రీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

భారత దేశంలో వందేళ్లకు ముందు నిర్మించిన ఏ మసీదును పరిశోధించినా కచ్చితంగా అక్కడ హిందూ దేవాలయం

ఆనవాళ్లే కనపడతాయి అనడానికి వారణాశి - జ్ఞానవాపి ఘటనే, విష్ణు ధ్వజ ( కుతుబ్ మినార్ ), మధుర ఇంకా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ముస్లిం ల దాడులకు గురైన విషయం అందరికి తెలుసునని, ఈ స్వయం ప్రకటిత మేధావి కి తెలియక పోవడం కన్నా, చరిత్ర ను తప్పుదారి పట్టించేందుకు నడుంబిగించినట్టుగానే కనపడుతోందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam