DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి పై శాస్త్రోక్తంగా విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభం పునః ప్రతిష్ట

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  01, 2022 (డిఎన్ఎస్):* ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం సింహాచలం కొండపై వెలసిన క్షేత్ర పాలకుడు కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు.

బుధవారం క్షేత్రానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి శక్తివంతమైన నారసింహ క్షేత్రం సింహాచలం అని, భక్తులు కోరిన కోరికలు తీర్చే సింహాద్రి నాథుడు ఇక్కడ అత్యంత మహిమాన్వితమైన స్వామిగా విరాజిల్లుతున్నారని అన్నారు. తొలుత నూతన ధ్వజస్తంభానికి అర్చక స్వాములు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి

చేతుల మీదగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా శారదా పీఠాధిపతి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనే అనేక నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ వరాహ, నారసింహ అవతారాల కలయిక ఒక్క  సింహాచలంకి మాత్రమే పరిమితం అన్నారు. ఒరిస్సా, మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ తో పాటు ఎన్నో రాష్ట్రాల భక్తులు

సింహాద్రి నాధుడును దర్శించుకోవడానికి రావడం జరుగుతుందని  వారందరికీ కూడా ఆలయ వర్గాలు  మెరుగైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. 
కొన్ని నరసింహ క్షేత్రాల్లో శైవ ఆలయాలు కూడా ఉన్నాయని దీని వల్ల  ఒకవైపు నారసింహుడు మరోవైపు పరమశివుడు ఆశీస్సులు భక్తులకు లభిస్తుందన్నారు.. హుద్ హూద్ లో ఈ శివాలయం ధ్వజ స్తంభం

నేలకొరిగిందని మంచి శుభమూహూర్తము లో పూజలు జరిపి తిరిగి ప్రతిష్టించడం సంతోష దాయకమన్నారు... మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎంవి సూర్యకళ,  ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam