DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ పురోహిత సమస్యలు బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి

(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)  

విశాఖపట్నం, జూన్ 04, 2022 (డిఎన్ఎస్): ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పురోహిత మిత్ర పెందుర్తి శాఖా నిర్వహణలో బ్రాహ్మణ, పురోహితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్టు

కమిటీ ప్రతినిధి ఏలూరు వెంకటరమణమూర్తి శర్మ తెలియచేసారు. శనివారం పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న పురోహిత, బ్రాహ్మణ ప్రతినిధుల నుంచి  వినతిపత్రాలను స్వీకరించారు.  గ్రూప్ ఈరోజు పరిసర ప్రాంతాల్లో ఉన్న పురోహితుల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అని బ్రాహ్మణ సమస్యలు ఏ విధంగా

పరిష్కరించుకోవాలి  అనే అంశం పై సమేషం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో  విజయ్ కుమార్ శ , కైలాసపతి శివాచార్య, శివ గణేష్ శర్మ, పూర్ణ సాయి కిషోర్ శర్మ, సురేష్ శర్మ, పవన్ కుమార్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ

కోపరేటివ్ సొసైటీ గుర్తింపు కార్డులను తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నీ బలోపేతం చేయాలని తెలియజేశారు. సుమారు భారీ సంఖ్యలో పురోహితులు వచ్చి వారి వారి సమస్యల్ని తెలియజేయడం జరిగింది. అతి త్వరలో ఈ దరఖాస్తులను  పూర్తిగా పరిశీలించి ఆంధ్ర ప్రదేశ్  బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్

దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, వాటి పరిష్కారం కోరతామని తెలియజేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam