DNS Media | Latest News, Breaking News And Update In Telugu

12 ఏళ్లకే టెన్త్ పరీక్ష లో ఉత్తీర్ణత, విశాఖ బాలిక కు 525 మార్కులు 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  06, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2022 పదవ తరగతి ఫలితాలలో విశాఖ నగరానికి చెందిన పాలూరు టానీషా 12 ఏళ్ళ వయస్సులోనే పరీక్ష కు హాజరు కావడమే కాక, అత్యధికంగా 525/600 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. 

విశాఖ

నగరంలోని గాజువాక హైస్కూల్ రోడ్డు ప్రాంతంకి చెందిన తల్లిదండ్రులు పాలూరూ లక్ష్మణా స్మామీ, దేవిల రెండవ సంతానం చదువుల తల్లి టానీషా. 12 ఏళ్ళకే పదవ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించి రికార్డ్ సృష్టించింది. మొదట నుండి చదువులలో చురుకుగా ఉంటె ఈ పాప వేగంగా ముందుకు పరుగెడుతూ ఉంటె. . ఈమె వయసు చిన్నారులు ఆరోవ తరగతి లో

కొనసాగుతున్నారు. జాతీయస్థాయిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తరుపున పలు రాష్ట్రాలలో పాల్గోని అందరి మన్నాలు పొందింది. ఇప్పుడు పదవ తరగతి అనంతరం డాక్టర్ అవ్వాలి అనే తన కోరికని బలపర్చుకోవడానికి జాతీయ స్థాయిలో జరిగే నిట్ ఎగ్జామ్ లో సైతం విజయం సాధించేందుకు ఇప్పడి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam