DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నుపుర్ శర్మ డిబేట్ వివాదంలో బీజేపీ శ్రీరామ పరిపాలనా నీతి అమలు

*విదేశాల మైత్రి కోసం పార్టీ నుంచి తొలగింపు, వ్యక్తిగా భద్రతాకై నుపుర్ కు రక్షణ* 

*మీరు కూడా ఫిర్యాదు చెయ్యండి, హిందువులకు విశ్లేషకుల సూచన*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  07, 2022 (డిఎన్ఎస్):* ప్రస్తుతం దేశ విదేశాల్లో అందరి లోను జరుగుతున్న చర్చ

నుపుర్ శర్మ వ్యాఖ్యల దుమారం. బాధ్యతాయుతమైన బృందంతో కూడిన భారతీయ జనతా పార్టీ ఈ ఘటన వివాదం పై శ్రీరామ పరిపాలనా నీతిని అమలు చేసింది. కేవలం శ్రీరాముణ్ణి కొలవడమే కాదు, అయన పరిపాలనా నీతిని కూడా అమలు చేస్తోంది. 

విద్యావంతులు, సుశిక్షితులతో నిండిన భారతీయ జనతా పార్టీ ఇటీవల ఎదురైనా సమస్యల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా

నిర్వహించిందని విశ్లేషకుల మన్ననలు  అందుకుంటోంది. ఆ పార్టీ కి చెందిన జాతీయ అధికార ప్రతినిధి ( బహిష్కృత నేత ) నుపుర్ శర్మ ఒక టీవీ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలపై దేశ, విదేశాల్లో వెలుగు చూసిన విమర్శల నేపథ్యంలో ఆమెను పదవి నుంచి, పార్టీ నుంచి కూడా బహిష్కరించడం జరిగింది. అయితే ఇదే సమయంలో దుష్ట శక్తుల నుంచి ఆమెకు ఎదురైనా మరణ

హెచ్చరికల నుంచి ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ఒక వ్యక్తిగా వై కేటగిరి రక్షణ కల్పించింది. ఈ చర్యను సైతం ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక విశ్లేషకులు వివరించారు. 

రామాయణంలో రావణ వద్ద తర్వాత మరోసారి సీతమ్మను అడవుల్లో వదిలి పెట్టిన శ్రీరాముడి

నిర్ణయం సరైనదేనా అని మాజీ ప్రధాని వాజపేయి ని ఒకరు అడిగితె. . .సీతారాముడు గా ఈ ఘటన తప్పు,  రాజా రాముడిగా ఈ నిర్ణయం కరక్ట్ అని అన్నారు ట. ఇద్దరో ఒక్కరే కదా రెండిటికి తేడా ఏంటి అని అడిగితె. . వాజపేయి ఇచ్చిన సమాధానం ఇదే: . . .
దేశ భద్రతను, ప్రతిష్టను కాపాడవలసిన భాద్యత రాజుగా ఉంటుందని, ఆనాడు శ్రీరాముడు చేసింది అదేనన్నారు.

అయితే సీతారాముడిగా ఆమెను సురక్షిత ప్రాంతానికి చేర్చే ఏర్పాట్లు చేశాడన్నారు. 

శ్రీరాముణ్ణి నమ్ముకున్న భారతీయ జనతా పార్టీ కూడా నేడు అదే విధానాన్ని అమలు చేసిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. 

నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతినిధిగా చేసినందున దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా

తీసుకునే చర్యల్లో భాగంగా ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించడం తో పాటు, దుష్ట శక్తుల నుంచి ఆమెకు, ఆమె కుటుంబానికి ప్రమాదం కలగకుండా గట్టి భద్రతా కూడా కల్పించింది. 

అంతర్జాతీయ స్థాయి వేదికపై భారత దేశ కీర్తి దెబ్బతినకుండా, విదేశీయుల విలువలకు గౌరవం ఇస్తూ. . పార్టీ నేతలపై బీజేపీ అధిష్టానం (భారత ప్రభుత్వం లో

అధికారం లో ఉన్నందున) చర్యలు తీసుకున్నట్టు తెలియచేస్తున్నారు. 

అయితే. . ఏ మతానికి సంబంధించిన అంశాన్నైనా వాళ్ళ మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడడం ఎవ్వరికి సమంజసం కాదు, ఇది కేవలం హిందూ వాదులకు మాత్రమే పరిమితం కాదు, ఇతర మతస్థులు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని విశ్లేషకులు

తెలియచేస్తున్నారు. 

ఇప్పడికే హిందూ దేవి దేవతలపై ప్రతి రోజూ నోటికి వచ్చిన అసభ్య పోస్టర్లు, కామెంట్లు, వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం వాళ్లపై ఏ ఒక్క హిందువు పోలీసులకు ఫిర్యాదు చెయ్యక పోవడమేనన్నారు. 

ఇతర మతస్థుల్లో ఉన్న ఐక్యత, చైతన్యం, హిందువుల్లో

లేకపోవడమే హిందూ దేవీదేవతలపై విశృంఖల అసభ్య వ్యాఖ్యలకు ఊతమిస్తోందన్నారు. 

ఇతర మతాల విశ్వాసాలకు గౌరవం ఇవ్వడం ఒక్కటే భాద్యత కాదని, మన ధర్మాన్ని ఇతరుల నుంచి కాపాడుకోవడం కూడా మన భాధ్యతేనన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam