DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకేష్ రాకతో పుంఖాను పుంఖాలుగా ఐటీ సంస్థల ప్రభంజనం

ఒక్కరోజే 13 కంపెనీలు ప్రారంభం, క్యూ లైన్లో డజన్లకొద్దీ వెయిటింగ్...

విశాఖపట్నం, ఆగస్టు 10 , 2018 (DNS Online ): విభక్త ఆంధ్ర ప్రదేశ్ ఐటి రంగ చరిత్రలో శుక్రవారం

సువర్ణాక్షరాలతో లిఖించతగ్గ రోజు. ఒకే రోజు 13 ఐటీ సంస్థలను రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి లోకేష్ విశాఖలో ప్రారంభించారు. అయన రాకతో ఐటీ సంస్థలు పుంఖాను పుంఖాలుగా

విశాఖనగరానికి వచ్చిపడుతున్నాయి. రెండురోజులు విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శుక్రవారం నగరం శివారు లోని కాపులుప్పాడ ఐటీ పార్క్ ని

దర్శించారు.అనంతరం విశాఖపట్నం నగరం నడిబొడ్డు లో ఉన్న టెక్ మహీంద్రా ఐటీ పార్కు లో శుక్రవారం  à°’కేరోజు 13 à°à°Ÿà±€ కంపెనీలను ప్రారంభించారు. మరో నాలుగు కంపెనీల

విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.  à°¸à±à°®à°¾à°°à± 1400 ఎకరాల్లో సిద్ధమవుతున్న కాపులపాడ ఐటీ పార్క్ వద్ద మౌలిక వసతులు, హౌసింగ్, స్కూల్స్, ఇతర మౌలిక వసతులు కూడా ఓకే చోట

ఉండేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. à°µà°¿à°¶à°¾à°–పట్నం ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రెస్ à°—à°¾ మారబోతుందని అన్నారు. నాలుగు దశల్లో కాపులుప్పాడ ఐటీ పార్క్ అభివృద్ధి

చెందుతుందని తెలిపారు. ఈ నాలుగు దశలు పూర్తి అయితే ఐటీ కార్యకలాపాలకు అందుబాటులోకి 700 ఎకరాలు రానుందని అన్నారు. తద్వారా ఒక్క కాపులుప్పాడ ఐటీ పార్క్ లోనే

సుమారుగా 5 లక్షల మంది ఐటీ రంగంలో పని చేసే అవకాశం వస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రోడ్లు,నీటి సరఫరా,విద్యుత్ ఇతర మౌలిక వసతుల కల్పన సెప్టెంబర్ లోపు పూర్తి

చెయ్యాలి అని అధికారులని ఆదేశించినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

 

#dns  #dnsmedia  #dnsnews  #dnslive  #dns media  #dns live  #dns news  #vizag   #visakhapatnam  #IT  #lokesh  #andhrapradesh  #andhra pradesh 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam