DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ పర్యవేక్షణలో సింహగిరి రామాలయ ధ్వజ స్తంభం ప్రతిష్ట

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  09, 2022 (డిఎన్ఎస్):*  సింహగిరిపైన పురాతనమైన, వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శ్రీ సీతా రామాలయం లో గురువారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. అపరరామానుజులు, పరమహంస పరివ్రాజకులు  త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి మంగళ

శాసనాలతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములు  పూర్తి చేశారు. ఆలయాల పైన నూతన కలశంలు ఏర్పాటు చేయడంతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ముందు అనేక పూజాది కార్యక్రమాలు, మహా పూర్ణాహుతి జరిపించారు. గత ఏడాది ప్రకృతి వైపరీత్యానికి ఆలయ ధ్వజస్థంభం భిన్నమైన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకూ తాత్కాలిక ఏర్పాట్లను

చేపట్టడం జరిగింది. ఈ ఆలయంలోనే గతంలోనే త్రిదండి పెద్ద జీయర్ స్వామి అత్యంత వైభవంగా శ్రీరామాయణ క్రతువు నిర్వహించి శ్రీరామ క్రతు స్థంభం ఏర్పాటు చేశారు. నేటికీ భక్తుల ఆరాధనలు అందుకుంటోంది.  

ఈ కార్యక్రమం లో సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు,  ఆలయ ఈవో ఎం వి సూర్యకళ,  

ట్రస్టు బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam