DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉచిత బోజనం పెడితే సహించలేని జగన్ పాలనను తిప్పికొట్టాలి: బీజేపీ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  10, 2022 (డిఎన్ఎస్):* ప్రజలకు ఉచితంగా భోజనం పెడితే సహించని  ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను త్రిప్పి కొట్టాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణు కుమార్ రాజు పిలుపునిచ్చారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళగిరి వద్ద ఏర్పాటుచేసిన ఉచిత భోజన సౌకర్యాన్ని అధికారులు, పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. పేదలకు మీరు తిండి పెట్టరు - తిండి పెట్టే వారిని కూడా పెట్టనివ్వరు అంటు ఎద్దేవా

చేశారు. 
ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన అయన విడుదల చేసారు. ప్రస్తుతం వైసిపి అరాచక పాలనను  ప్రజలు నిశ్చింతగా పరిశీలిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆ రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజావేదిక కూల్చివేత ద్వారా అరాచక పాలనకు నాంది పలికారని అన్నారు. గత ప్రభుత్వ

హయాంలో ప్రతి పేదవాడికి కడుపునిండా తిండి పెట్టలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మట్టుపెట్టాలని విమర్శించారు. అన్న క్యాంటీన్ ల ద్వార పేద ప్రజలకు రోజువారి కూలీలకు ఉదయం అల్పాహారం తో పాటుగా 5 రూపాయలకే  భోజన సదుపాయం ఉండేదని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదవాడు కడుపునిండా తిండి తినే వాడని,  ముఖ్యమంత్రి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు చర్య వల్ల ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam