DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కర్ణాటక నుంచి రాజ్యసభకు నిర్మల, మహా కూటమికి ఫడ్నవిస్ షాక్* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  11, 2022 (డిఎన్ఎస్):* బీజేపీ తరఫున కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్ మూడవ సారి రాజ్యసభ కు ఎన్నికయ్యారు.  కర్ణాటకలో మూడు స్థానాలు బీజేపీ వశం కాగా, నాలుగో సీటును కాంగ్రెస్ గెల్చుకుంది. బీజేపీ తరపున జగ్గేశ్, లెహర్ సింగ్లు విజయం

సాధించారు. కాంగ్రెస్ తరఫున జైరామ్ రమేశ్ గెలుపొందారు. ఎగువ సభకు కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి, జైరామ్ రమేశ్ నాలుగోసారి ఎన్నికయ్యారు.  15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా 41 మంది అభ్యర్థలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మహారాష్ట్రలో ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ

(ఎంవీఏ) కూటమి సర్కారుకు ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మంచి ప్రణాళిక తో దేవేంద్ర ఫడ్నవిస్ షాక్ ఇచ్చారు. 

శనివారం తెల్లవారుజామున వెలువడిన ఫలితాల్లో ఎంవీఏ మూడు సీట్లలో విజయం సాధించగా.. బీజేపీ కూడా మూడు సీట్లు గెలుచుకుని ఫలితాన్ని సమం చేసింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్,

రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహదిక్ బరిలో ఉండగా.. ఎంవీఏ కూటమి నుంచి సంజయ్ రౌత్ (శివసేన), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), ఇమ్రాన్ ప్రతాప్రి (కాంగ్రెస్), సంజయ్ పవార్ (శివసేన) పోటీకి దిగారు. సంఖ్యా బలం పరంగా బీజేపీ రెండు, అఘాడీ కూటమి మూడు స్థానాలో సునాయాసంగానే గెలిచింది. మిగిలిన ఆరో స్థానానికి బీజేపీ అభ్యర్థి ధనంజయ్

మహదిక్, కూటమి తరఫున శివసేన అభ్యర్థి సంజయ్ పవార్ మధ్య గట్టిపోటీ నెలకొంది. ఫలితాల్లో అనూహ్యంగా బీజేపీకి అనుకూలంగా 10 ఓట్లు రావడంతో ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam