DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వివేకా హత్య గురించి జగన్ కు ముందే తెలుసేమో: బుద్ధా వెంకన్న

 
*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  11, 2022 (డిఎన్ఎస్):*  వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ కు ముందే తెలుసేమో  , అందుకే జైల్ మీట్ విజయ సాయిరెడ్డిని  ముందే పంపించి గుండె పోటుతో మరణిం చారని నమ్మించారని,  టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ

ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. శనివారం విశాఖ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలను పక్కతోవ పట్టించ డానికి  సిబిఐకి అప్పజెప్పారన్నారు.  ఎన్నిక ల్లో గెలిచాక సిబిఐ విచారణ అక్లర్లేదని చెప్పడంలో ఆంతర్యమేంటి సొంత బాబాయ్ హత్య గురించి మూడేళ్లుగా జగన్

మాట్లాడటంలేదన్నారు.  

కుట్రదారులు పేర్లు బైటకు వస్తాయని సాక్ష్యాలు అన్నింటినీ తొక్కి పెడు తున్నారు‌ గంగాధర్ రెడ్డి ముఖ్య సాక్షి అనంత పూర్ ఎస్పీని ముందే కలిసి తనకు ప్రాణహాని వుందని వాపో యారన్నారు. రాత్రి వరకూ ఆరోగ్యం తో ఉన్న 40 ఏళ్ల యువకుడు ఉదయానికి అనారోగ్యంతో ఎలా చనిపోతాడని,  వివేకానందరెడ్డి హత్య

కేసులో సాక్షు లు అనుమానాస్పద స్ధితిలో చనిపోతు న్నారు జగన్ పాత్ర ఎంత వరకూ వుందో సిబిఐ విచారాణ జరపాలన్నారు.  

గంగాధర్ రెడ్డి మృతిపై కూడా సిబిఐవిచారణ జరపాలి హత్యలు చేసి వ్యవస్ధలను మేనేజ్ చేసినట్లుగా కుటుంబ సభ్యులను కూడా మేనేజ్ చేస్తున్నారు వివేకాతో శత్రుత్వం ఎవరి తో వుందో ఆరాతీస్తే మూలాలు బైటకు వస్తాయి

హత్యకేసు దర్యాప్తు వేగ వంతం చేయమని సునీతారెడ్డి వాపోతున్నా జగన్ కు పట్టడంలేదని,  సునీతా రెడ్డి కి ఆమె భర్తకు రక్షణ కల్పించాలన్నారు.  

వేగవంతం చేయకపోతే ఇంకా అనేక మంది చనిపోయే ప్రమాదం వుంది ఎన్నికల్లో లబ్దికోసం ennainaa ఘోరాలు చేయించి,  ఆ పాపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టి సానుభూతి ఓట్లు పొందవచ్చు

అన్నారు. 

తనకు సిబిఐ నుంచి నోటీసులు ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు.  జగన్ అనేక సార్లు ఢిల్లీ వెళుతున్నారు సిబిఐ ఆఫీస్ కి వెళ్లి దర్యాప్తు వేగవంతం చేయమని ఎందుకు అడగడం లేదన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam