DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ ఖాతాలో మరో గిన్నిస్ రికార్డ్, 5 రోజుల్లో 75 కిమీ రోడ్డు నిర్మాణం 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  12, 2022 (డిఎన్ఎస్):* భారతదేశం 5 రోజులలో (105 గంటల్లోనే)  75 కిలోమీటర్ల రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా, చత్తీస్గహార్ లోని రాయ్‌పూర్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, అకోలా మరియు గుజరాత్

లోని సూరత్ నగరాలను కలుపుతున్న జాతీయ రహదారి 53  లో రోడ్డు విస్తరణ పూర్తి చేసి రికార్డ్ సాధించింది. అమరావతి ( మహారాష్ట్ర) నుంచి అకోలా మధ్య గల 75 కిలోమీటర్ల రోడ్డు ను  జూన్ 3న ఉదయం 7:27 గంటలకు పనులు ప్రారంభించి జూన్ 7న సాయంత్రం 5 గంటలకు పూర్తి చేసినట్లు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 105 గంటల 33 నిమిషాల

రికార్డు సమయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒకే లేన్‌లో 75 కిలోమీటర్ల నిరంతర బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణాన్ని ఐదు రోజులలోపు విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమం లో మొత్తం 720 మంది కార్మికులు ప్రాజెక్ట్‌లో పనిచేశారని మంత్రి తెలిపారు. 

75 కిలోమీటర్ల

సింగిల్ - లేన్ నిరంతర బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు మొత్తం పొడవు 37.5కిమీ రెండు - లేన్ చదును చేయబడిన షోల్డర్ రోడ్డుకు సమానం. 

ఈ రికార్డ్ ఇంతవరకు ఖతార్ పేరిట ఉండేది. దోహా లో 25 .27 కిలో మీటర్ల రోడ్డును పూర్తి చేయడానికి ఖతార్  10 రోజులు పట్టింది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam