DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర్ నగర్ ఇస్కాన్ లో వైభవంగా జగన్నాధుని స్నాన యాత్ర

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  14, 2022 (డిఎన్ఎస్):*  జూలై 1న నిర్వహించనున్న  జగన్నాథుడి రథయాత్రలో భాగంగా జ్యేష్ఠ పూర్ణిమ అనగా ఈరోజు(14.06.2022) జగన్నాధుని దేవస్నాన వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. రథయాత్రలో ఎంతో కీలకమైన ఈ వేడుకలో భాగంగా జగన్నాథ, బలభద్ర, సుభద్ర,

సుదర్శనుల దేవస్నానం జరిగింది. భక్తుల భజన కీర్తనల మధ్య చతుర్ధామూర్తులను పంచామృతాలతో ను మరియు 108 కలశాలోని పవిత్ర జలాలతో అభిషేకించారు. 

స్నాన ఘట్టం ముగిసిన తర్వాత ముగ్గురు భగవద్ మూర్తులు గజరూపంలో (హాతి వేష్) భక్తులకు దర్శనమిచ్చారు. మందిర అధ్యక్షులు శ్రీమాన్ సాంబదాస్ ప్రభుజీ మరియు పూజ్య నితాయి సేవిని

మాతాజీ వారు జగన్నాథ లీలలపై ప్రత్యేక ప్రవచనం చేసారు.

తరువాత   భగవద్ మూర్తులను చీకటి మందిరానికి తరలించారు. నీటిలో తడిసిన భగవద్ మూర్తులకు జలుబు మరియు జ్వరం వస్తుంది. అందుకే భగవద్ మూర్తులను పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి, ఈ పదిహేను రోజులు స్వామికి సమర్పించే నైవేద్యాల్లోనూ ఆయుర్వేద మూలికలు

వాడుతారు. ఈ పదిహేను రోజులు భక్తులకు జగన్నాథుడి దర్శనం లభించదు. గర్భాలయంలో కేవలం స్వామివారి చిత్ర పటం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. దీనిని పట్టచిత్రా అని పిలుస్తారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజు చీకటి మందిరం నుంచి మూలవరులను గర్భాలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. అనంతరం విశ్వప్రసిద్ధ రథయాత్ర వేడుక జూలై 1న

నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam