DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి ఆలయంలోనే అర్ధరాత్రి చోరీ,3.5 కేజీల కిరీటం, నగ చోరీ 

*(DNS రిపోర్ట్: ఏలూరు వెంకట రమణ, పెందుర్తి)*  

విశాఖపట్నం, జూన్  14, 2022 (డిఎన్ఎస్): కొత్తవలస సమీపంలోని దేశభద్రుపాలెం  గ్రామాన్ని కాపాడుతున్న అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఆగంతుకుడు ప్రవేశించి అమ్మవారి కిరీటం, నగలు చోరీ చేసినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. .

.కొత్తవలస కి వెళ్లే రహదారిపైనే ఫెల్లోయ్స్ సంస్థ ప్రక్కనే ఉన్న బంగారమ్మ అమ్మవారి ఆలయం లో నిత్యా ఆరాధనలు ముగిసిన తదుపరి గ్రామస్థులు ఆలయం మూసి వేశారు. రాత్రి వేళల్లో ఈ ఆలయంలో విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో సీసీ కెమెరాలను కూడా అమర్చడం జరిగింది. మంగళవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన గ్రామస్తులకు చోరీ

విషయం తెలియడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విజయనగరం నుంచి పొలిసు డాగ్ బృందాలు వచ్చి ఆలయాన్ని పరిశీలించాయి. సీసీ కెమెరా లోని దృశ్యాలను సేకరించి విచారించనున్నారు. ఈ చోరీలో అమ్మవారి విగ్రహం ఫై 3.5  కిలోల భారీ వెండి కిరీటం, 3 తులాలకు పైగా వెండి నగ, తో పాటు హుండీ లోని సుమారు రూ. 5 వేల నగదు చోరీకి గురైనట్టు

స్థానికులు తెలియచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam