DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నూపుర్ జోలికి వస్తే 18 లక్షల నాగ సాధువులు రంగంలోకి దిగుతారు 

*భారత్ లో రాజ్యాంగమే అమలు చేస్తారు షరియా కాదు, సంత్ బాలక దాస్* 

*హిందూ వ్యతిరేక సంఘ విద్రోహులకు కాశి ధర్మ పరిషద్ హెచ్చరిక,*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  14, 2022 (డిఎన్ఎస్):* హిందూ ధర్మం గురించి మాత్రమే మాట్లాడే సుప్రీం కోర్టు న్యాయవాది నూపుర్

శర్మ జోలికి వస్తే. . దేశంలోని 18 లక్షల నాగ సాధువులు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తారని కాశి ధర్మ పరిషద్ హెచ్చరించింది. మూడు రోజుల క్రితం వారణాశి లో జరిగిన ధర్మ పరిషద్ సమావేశంలో పలు అఖాడాలకు చెందిన సాధువులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
సమావేశానికి పాటల్‌పురి మఠానికి చెందిన

మహంత్ బాలక్ దాస్ అధ్యక్షత వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ దేశంలో అమలు చేసేది రాజ్యాంగమే తప్ప సభ్య సమాజం హర్షించని షరియా చట్టం కాదన్నారు. 
ప్రస్తుతం హిందూ సమాజానికి వ్యతిరేకంగా మసీదుల కేంద్రంగా చేస్తున్న దురాగతాలను తక్షణం నిలిపి వెయ్యాలని బాలక్ దాస్ హెచ్చరించారు. ఈ సమావేశం శనివారం

విశ్వేశ్వర్‌గంజ్‌ హారతిరథ్‌లోని సుదామ కుటిలో కాశీ ధర్మ పరిషత్‌ సమావేశం జరిగింది.

అత్యంత కీలకమైన ఈ సమావేశంలో 16 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ ప్రతిపాదనలను అన్ని అఖాడాలు, అన్ని శాఖల అధిపతులతోపాటు ప్రభుత్వానికి పంపనున్నారు. 

కేవలం వాళ్ళ పుస్తకంలో ఉన్న విషయాన్నే నూర్పుర్ శర్మ

మాట్లాడితే అది సహించలేని కొన్ని ముస్లిం వర్గాలు ఆమెను గొంతు కోసి, అత్యాచారం చేస్తాం లాంటి  బెదిరింపులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జ్ఞానవాపిలో దొరికిన శివలింగానికి రంధ్రాలు చేసిన కమిటీ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

అనేక నగరాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం హింసను

ఖండిస్తూ ఈ సమావేశంలో సాధువులు తీర్మానం చేసినట్టు సమాచారం. దేశాన్ని కాపాడేందుకు సాధువులు కూడా రోడ్డుపైకి రావాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రతి మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మౌలానాల ప్రసంగాలను రికార్డు చేయాలని సమావేశంలో డిమాండ్‌ చేశారు.

ఇస్లామిక్ ఛాందసవాదులు విధ్వంసం

సృష్టిస్తున్న తీరును సంత్ సమాజ్ ఎన్నటికీ సహించదని అన్నారు. దేశాన్ని కాలిపోకుండా కాపాడేందుకు సంత్ సమాజ్ వీధుల్లోకి వస్తుంది. హింసకు పాల్పడిన ఛాందసవాదులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జ్ఞానవాపిలో దొరికిన శివలింగానికి రంధ్రాలు చేసిన కమిటీ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు

చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కొత్వాల్ మోహన్ దాస్ మాట్లాడుతూ మనం రాముడి మార్గాన్ని అనుసరించే ప్రజలం. చేస్తున్న హింస ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, అన్ని వర్గాలు, అఖాడాలు, నాగాలతో మాట్లాడి పెద్ద నిర్ణయం తీసుకుంటాం.

సమావేశంలో ఆమోదించబడిన అంశాలు ఇవే: . .

శుక్రవారం హింసకు

పాల్పడే వ్యక్తులను నిషేధించాలి.

రాళ్లు రువ్వుతున్న మసీదును మూసివేయాలి.

జ్ఞాన్వాపిపై నిజం చెప్పిన బాబాకు శాశ్వత భద్రత కల్పించాలి. దాడి చేసిన వారిని అరెస్టు చేసి ఎన్‌ఎస్‌ఏ విధించాలి.

నూపుర్ శర్మను రేప్ చేస్తామంటూ బెదిరించిన వ్యక్తులపై జాతీయ భద్రతా చట్టం అమలు

చెయ్యాలి.

ఇస్లామిక్ ఛాందసవాదుల నుంచి దేశాన్ని కాపాడేందుకు సాధువులు కూడా రోడ్డుపైకి రావాలి.

దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్రను బయటపెట్టాలి.

అతి త్వరలోనే సాధువులు, మహాత్ములు, నాగ సాధువుల సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.

హిందూ దేవి దేవతలపై కించపరిచే వ్యాఖ్యలు,

సినిమాల్లో జోకులు వేసే వారిని వెంటనే జైలుకు పంపాలి.

స్థానిక స్థాయిలో జిహాదీల జాబితా తయారు చేయాలి.

శుక్రవారం రోజున విద్వేషాలు రెచ్చగొట్టే మౌలానాలను అరెస్టు చేసి ఆస్తులు జప్తు చేయాలి.

ప్రతి మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మౌలానా ప్రసంగాన్ని రికార్డు చేయాలని

సూచించారు.

దేశ గౌరవంతో ఆడుకుంటున్న ఇస్లామిక్ దేశాలతో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకాలి.

నగర స్థాయిలో సంత్ సమాజ్ యూనిట్ ఏర్పడుతుంది, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు.

శుక్రవారం రోజున, జార్ఖండ్ ప్రభుత్వం రాంచీలో అల్లర్ల నిందితులను తక్షణమే జైలుకు పంపాలని, లేకుంటే దేశవ్యాప్తంగా

ఆందోళనకు సిద్ధంగా ఉండండి.

ఛాందసవాదులను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించింది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam