DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వే ఫలితంతో పాలక పార్టీలో ఆందోళన: టీడీపీ నేత చండీప్రియ

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  15, 2022 (డిఎన్ఎస్):* తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభంతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం‌ ఆరంభం కాబోతోందని రాజ మహేంద్రవరం నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ ప్రకటించారు. దేశవ్యాప్త సంస్థ జరిపిన సర్వేలో

వైఎస్సార్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి ఊహించనిరీతిలో పెరగడంతో పాలకులలో ఆందోళన మొదలైందని ఆమె వెల్లడించారు.‌ ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రజలను మరింతగా చైతన్యం చేయబోతున్నారని చండీప్రియ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. చంద్రబాబు నాయుడి జిల్లాల పర్యటన బుధవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రారంభం అవుతున్న నేపధ్యంలో

చండీప్రియ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ' ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా ' పేరుతో ఆరంభమవుతున్న చంద్రబాబు పర్యటనలను ప్రజలంతా దిగ్విజయం చేయాలని ఆమె కోరారు. హంతకులకు, దౌర్జన్యకారులకు, ముష్కరులకు మద్దతుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై చాప క్రింద నీరులా వ్యతిరేకత పెరిగిపోయిందని చండీప్రియ వెల్లడించారు.

చంద్రబాబు పర్యటనల ద్వారా ప్రజలంతా మరింతగా రాష్ట్ర అస్తవ్యస్త పాలనా పరాకాష్ఠ ను తెలుసుకోవాలని ఆమె కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam