DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గో రక్షణకై జులై 2 న బీజేపీ జాతీయ సభ వద్ద భారీ గో నిరసన యాత్ర

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  15, 2022 (డిఎన్ఎస్):* హిందువుల పవిత్రమైన గోమాత రక్షణకై జూలై 2 వ తేదీన భాగ్యనగరంలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ గోయాత్ర చేస్తున్నట్టు యుగ తులసి ఫౌండేషన్  చైర్మన్,

కొలిశెట్టి శివ కుమార్ ప్రకటించారు. గో మాతకు జాతీయ హోదా విషయంలో మోదీజీ 8 సంవత్సరాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 108 గోవులతో గో మహా క్షేత్రం, బాట సింగారం నుండి హెచ్ ఐ సి సి నోవాటెల్ వరకూ జరిగే గో మహా నిరసన యాత్రలో పాల్గొనే గో బంధువులు, హిందూ బంధువులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

విశ్వ మాత గోమాత ఈ రోజు నిత్య

నరకాన్ని అనుభవిస్తోంది. కాళ్ళు కట్టి, కొమ్ములు విరగ్గొట్టి బస్తాలో ఎండు మిరపకాయలు కుక్కినట్టు డొక్కు వాహనాల్లో వందల కిలోమీటర్లు తరలించి కసాయి కబేళాల్లో అతి క్రూరంగా హత్య చేస్తుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నాయి. రోజుకి కొన్ని వేల గోవులు గొంతు తెగి నెత్తుటి

మడుగులో నేల కూలుతున్నా పాలకులు ఎవరికీ పట్టింపు లేదు. రోజువారీ గోమేధానికి అదనంగా బక్రీద్ పేరుతో హైదరాబాద్ లో గో రక్తాన్ని పారిస్తున్నారు. వేల గోవుల గొంతులు కోసి అవతల పారేస్తున్నారు. ఈ   అకృత్యాన్ని ప్రశ్నించేదెవరు? ఈ దారుణాన్ని ఆపేదెవరు? నిలబడేదెవరు? నిలదీసేదెవరు? అని ఆవేదన వ్యక్తం చేసారు. 

జాతీయ హోదా

ద్వారా గోవుకి రాజ్యాంగ బద్ద రక్షణ కల్పించాలని గత రెండేళ్లుగా యుగ తులసి ఫౌండేషన్  అలుపెరుగని పోరాటం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జగద్గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, సాధువులు, సంతులు తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరిగిన గో మహా సమ్మేళనం నుండి ముక్త కంఠంతో కోరినా కేంద్రం కనీసం కన్నెత్తి చూడలేదు.

సాక్షాత్తూ గోవిందుడే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసి పంపించినా ప్రధాన మంత్రి మోదీ గారు పట్టించుకోని పరిస్థితి. గోవు ఏం పాపం చేసింది? 

అడక్కుండానే కాశ్మీర్ కి స్వేఛ్చ కల్పించారు, అయోధ్యలో భవ్య రామమందిరాన్ని నిర్మిస్తున్నారు, కాశీలో కారిడార్ నిర్మించారు. కానీ ఇన్ని సార్లు, ఇంతమంది

అడిగినా, మొర పెట్టుకున్నా ఒక్కసారైనా మోదీజీ గోవు గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు. జాతీయ ప్రాణిగా ఎందుకు ప్రకటించడం లేదు? దేశంలో ఇవ్వాళ కేవలం 8 కోట్ల గోవులు మాత్రమే మిగిలాయి. రానున్న 5, 10 ఏళ్లలో అవికూడా అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది. అదే జరిగితే దేశం నాశనం కావడమే కాదు, భూమ్మీద మానవజాతి మనుగడకే పెను

ప్రమాదం ఏర్పడుతుంది. 

అందుకే గోమాతకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ దృష్టికి తీసుకువెళ్ళడానికి 108 గోవులు జూలై 2 వ తేదీ ఉదయం 10 గం.లకు గో మహా క్షేత్రం, బాట సింగారం నుండి హెచ్ ఐ సి సి నోవాటెల్ వరకూ గో మహా నిరసన యాత్ర చేపడుతున్నాయి. గోవు బతకాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ నిరసన యాత్రలో

భాగస్వాములు కావాలి. గోవుని, దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడానికి మనకున్న చివరి అవకాశం ఇదే. రండి గోవు కోసం గొంతెత్తుదాం, గోవు కోసం రోడ్డెక్కుదాం. 

ఇది కేవలం శివ కుమార్ పోరాటం కాదు, యుగ తులసి ఫౌండేషన్ ఆరాటం కాదు. గోవు జీవన్మరణ సమస్య. దేశ భవిష్యత్ సమస్య. అందుకే శ్రీ నరేంద్ర మోదీజీని మరోసారి అడుగుదాం. గోవు

గురించి ఒక్కసారి ఆలోచించమని సవినయంగా విజ్ఞప్తి చేద్దాం. జాతీయ కార్యవర్గ సమావేశాల సాక్షిగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించమని డిమాండ్ చేద్దాం. 

గొంతు తెగుతున్న గోవు చేస్తున్న ఈ మహా నిరసన యాత్రలో మనసున్న ప్రతి ఒక్కరినీ పాలు పంచుకోవాల్సిందిగా మరోసారి మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గోవుతో గొంతు

కలిపేవాళ్ళంతా దయచేసి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam