DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లకు కేంద్రం అనుమతి 

*(DNS report: P Raja, Bureau chief, Amaravati)*  

*అమరావతి: జూన్  16, 2022 (డిఎన్ఎస్):* కోవిడ్ మహమ్మారి ప్రభావం అనంతరం రైల్వే శాఖ నిలిపివేసిన  జర్నలిస్టుల తో సహా అన్ని వర్గాల కన్సెషన్ టికెట్లను తిరిగి అనుమతిస్తూ రైల్వే బోర్డ్ ఆదేశాలు జారీ చేసినట్టు ఈ మేరకు అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్),న్యూ ఢిల్లీ,జాతీయ

సీనియర్ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు పాత్రికేయులకు తెలియచేసారు. 
ఆయా రైల్వే జోన్ ల జీఎం ల నుంచి వివిధ డివిజన్ల రైల్వే అధికారులకు ఈ ఉత్తర్వులు అందిన తదుపరి జిల్లా స్థాయిల్లో పాత్రికేయులకు రైల్వే శాఖా రాయితీ పాస్ లను అందించడం జరుగుతుందని తెలిపారు. 
ఇప్పటివరకు కేవలం కొన్ని వర్గాల కు మాత్రమే కోవిడ్

నిబంధనలు సరళం చేసినాక అనుమతించిన రైల్వే శాఖ జర్నలిస్ట్ ల పాస్ లతో పాటు, ఉద్యోగులు సహా, అన్ని తరహాల రాయితీ పాస్ లను నిలిపి వేసింది. తిరిగి వాటిని అమలులోకి తీసుకు వస్తున్నట్టు ఆమోదం తెలిపిందన్నారు. ఇక నుండి అక్రిడేటెడ్ జర్నలిస్టులతో సహా అన్ని కేటగిరీలకి కన్సెషన్ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యాన్ని

సోదర పాత్రికేయ మిత్రులు స్థానిక రైల్వే కార్యాలయాలతో సంప్రదించి పిమ్మట వారు జారీచేసే రైల్వే పాసులు తీసుకోవాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam