DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవో 306 లో ఒకపదం మరుగు చేసి. . దేవాదాయ శాఖా ఆస్తులు ప్రయివేట్ పరం!!

*దేవాదాయ శాఖా ఆస్తులు అన్యాక్రాంతానికి అధికారులే సిద్దపడ్డారా?* 

(DNS రిపోర్ట్: BV సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)  

విశాఖపట్నం, జూన్  16, 2022 (డిఎన్ఎస్): ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఆస్తులను నిబంధనలకు విరుద్దంగా ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైనట్టు

తెలుస్తోంది. గతంలో దాతలు విరాళంగా ఇచ్చిన ఆస్తులను కేవలం అనుభవించడానికే ఉన్న వాటితో పాటు, ప్రభుత్వ  పాలసీకి వ్యతిరేకంగా, నిబంధనలకు తుంగలోకి తొక్కి ఉన్నతాధికారులు కొన్ని సంస్థలను ప్రయివేట్ పరం చేసేందుకు పత్రాలు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఉదంతాలలో ఒకటి.  ఆర్య

వైశ్యుల నిర్వహణలో ఉండి ఆర్య వైశ్యులకు మాత్రమే సేవా కార్యక్రమాలు చేసే అన్నసత్రాలను, సంస్థలను  ఆర్య వైశ్యుల కమిటీలకు అప్పచెప్పమని  ప్రభుత్వం స్పష్టంగా జీ. ఓ 306 ను జారీ చేయడం జరిగింది. అయితే అందులోని ఆర్యవైశ్యులు అన్న ఒకే ఒక్క పదాన్ని ఆసరాగా తీసుకొని  దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు జీ. ఓ కి వ్యతిరేకంగా

సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజలకు సేవాకార్యక్రమాలు చేసే సంస్థలను కూడా ఆర్యవైశ్య పేరుతో ఏమాత్రం అర్హత లేని ప్రైవేట్ వ్యక్తులకు, కమిటీలకు ధారాదత్తం చేస్తున్నట్టుగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇలా చేయడం వల్ల ప్రభుత్యనుకి కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

ఆర్యవైశ్యులకు

సంబంధించిన ఈ జీవో 306 లో ఆర్యవైశ్యులు నిర్వహణలో అన్నదాన సత్రములు అని ప్రత్యేకంగా ప్రకటించబడింది. అయితే. ప్రస్తుతం అహికరుగనం ఈ జీవో ను తమకు అనుకూలంగా అన్నదాన సత్రములు అనే పదాన్ని కనుమరుగు చేసి, అన్నదాన సత్రాలతో పాటుగా, ఆర్యవైశ్యులు నిర్వహణలో విద్య సంస్థలను కూడా ప్రయివేట్ వ్యక్తులకు స్వాధీన పరిచేందుకు కార్యాచరణ

చేపడుతున్నట్టు తెలుస్తోంది. తక్షణం దీన్ని అడ్డుకోవాల్సిన భాద్యత దేవాదాయ శాఖా సర్వశ్రేష్ఠా అధికారుల పై ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam