DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే ఆస్తులు ధ్వంసం చెయ్యొద్దు:విశాఖ రైల్వే డిఆర్ఎం అనూప్ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  17, 2022 (డిఎన్ఎస్):* భారతీయ రైల్వే ప్రజల సేవ కోసమే నడుస్తోందని, దాని ఆస్తులు ధ్వంసం చెయ్యడం అత్యంత దారుణమని, అలాంటి దేశ సంపదను ఎవ్వరూ ధ్వంసం చెయ్యవద్దని, ఎవరిపైనేన అనుమానం కలిగితే స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని

విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ అనూప్ శతపతి పిలుపు నిచ్చారు.  అసాంఘిక శక్తులు రైల్వే ఆస్తులపై వివిధ ప్రాంతాల్లో ధ్వంసం చేస్తున్నట్టుగా సమాచారం అందడంతో విశాఖ రైల్వే డివిజన్ లోని అన్ని రైల్వే స్టేషన్ల వద్ద, రైల్వే ఆస్తుల వద్ద భారీ పొలిసు భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
ప్రయాణీకులకు అత్యంత సురక్షిత

కల్గిన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే సిబ్బంది కృషి  చేస్తున్నట్టు తెలిపారు. సోషల్ మీడియా లో వచ్చే అవాస్తవాలు, రూమర్లను నమ్మవద్దని, రైల్వే శాఖా ఏ రైళ్లను అయినా రద్దు చేసినట్టు అయితే ఆ విషయాన్నీ అధికారికంగా తామే ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతానికి శుక్రవారం హైద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే 18046 ఈస్ట్ కోస్ట్

రైల్ ను,  రైలు నెంబర్ 12704 సికింద్రాబాద్ - హౌర  ఫలక్ నుమా రైలు మాత్రమే రద్దు చేయడం జరిగిందన్నారు.    

 ఈ దురాగతాలపై  రైల్వే శాఖా కఠినంగానే వ్యవహించే అవకాశం ఉంది. గతంలో జరిగిన పలు ఉద్యమాల సమయంలో రైళ్లు రోకో ల ఘటనల్లోనే రైల్వే శాఖా నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంది. అలాంటిది ఏకంగా రైళ్లను తగలబెడితే అంట

సులభంగా ఊరుకునే అవకాశం లేదని, రైల్వే వర్గాలు తెలియచేస్తున్నాయి. ఎంతో ఉజ్వల భవిషత్ ఉన్న యువత ఈ దుశ్చర్యల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam