DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశా యాప్ పై అవగాహనకు వీధి నాటిక ప్రదర్శన

*విశాఖపట్నం, జూన్  17, 2022 (డిఎన్ఎస్):* ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగముగా దేశంలో ప్రజలపై జరుగుతున్న సైబర్ దాడుల పట్ల సైబర్ మోసాలపట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యడానికి అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, రాష్ట్ర హోం శాఖ నిర్వహణలో రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ కళాకారులు, ద

క్రైం వీధి నాటిక ను వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించారు. ప్రముఖ రంగస్థల దర్శకులు దండు నాగేశ్వరరావు పర్యవేక్షణలో దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలోను గాజువాక ఆదిత్య కాలేజీలోను మల్కాపురం బజార్ ల్లో జరిగాయి. 

వీధి నాటిక ప్రదర్శన ద్వారా ప్రజలు సైబర్ నేరాల పట్ల ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి ఏవిధంగా అవగాహన

కలిగివుండాలి అనే విషయం తెలియచేసారు. 

ఎవ్వరూ తమ బ్యాంక్ అకౌంట్ నంబర్, పాస్ వర్డ్, ఏటిఎం పిన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, వోటిపి నంబర్లను ఎవ్వరికి చెప్పకూడదన్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయరాదని,  ఆన్లైన్ ఉద్యోగ వ్యాపార ప్రకటనలను చూసి మోసపోకుడదని తెలియజేశారు. 
ఎవరికైనా  ఆన్లైన్లో ఏదైనా మోసం

జరిగితే దగ్గర్లో వున్న పోలీస్ స్టేషన్ లో తెలియపరచాలని లేదా సైబర్ క్రైమ్ అన్ లైన్ నంబర్1930 కు  ఫోన్ చేసి సమాచారం అందించవొచ్చని లేదా సైబర్ వెబ్ లింక్ ద్వారా కూడా పోలీస్ వారికి సమాచారం అందించవోచ్చని చెప్పారు. ప్రధానంగా మహిళలు, యువతులు ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చెయ్యకూడదని, కష్టాలను కోరి

తెచ్చుకోవొద్దన్నారు. 

ప్రతి ఒక్క మహిళ యువతి వేధింపులనుంచి లైంగిక దాడుల నుంచి రక్షణ పొందడానికి దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని దిశా యాప్  తమతో వుంటే పోలీస్ వారి సహాయం తమతో వున్నట్టేనని తమయొక్క నాటిక ప్రదర్శన ద్వారా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు తెలియ పరిచారు,
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam