DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నీ బైజూస్ వీడియోల్లో చెప్తే టీచర్లు ఏమి చెప్తారు?: తెలుగు శక్తి బివి రామ్

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  18, 2022 (డిఎన్ఎస్):* విద్య విధానం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా టీచర్ల వ్యవస్థను కించపరిచే విధంగా ఉందని తెలుగుశక్తి వ్యవస్థాపకులు బివి రామ్ మండిపడ్డారు. బైజుస్ సంస్థ తో ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విభాగం

ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు పొందిన ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు టీచింగ్ రంగంలో ఎంతో విశేషమైన శిక్షణ పొంది, బి ఈడీ  పూర్తి చేసిన వారని, వీరిలో అధిక శాతం మందికి రెండు దశాబ్దాలకు పైగా టీచింగ్ అనుభవం ఉందన్నారు. వందలాది మందిని ఉత్తమ శిక్షార్ధులుగా

తయారు చేసిన ఘనత ఉందన్నారు. వీళ్ళని కాదని, బైజూస్ సంస్థ తో ఒప్పందం చేసుకుని, ఆన్ లైన్ ద్వారా తరగతులు చెప్పించడం ద్వారా టీచర్లు కు ఇంకా స్కూళ్లల్లో పనేమీ ఉంటుందన్నారు. 

విద్యను కార్పొరేట్ స్థాయి కి తీసుకు వెళ్తాం అంటే టీచర్లను ఇంటికి పంపేసి, ఆన్లైన్ తరగతులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. టీచర్లకు సొంతంగా

పనిచేసే అవకాశం కల్పిస్తే. . వాళ్ళు అత్యున్నత విద్యావంతులకు ధీటుగా విద్యార్థులను తయారు చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు అనుసరించే విధానం వేరుగా ఉంటుందని, అది ప్రభుత్వ అధికారులు సూచించిన విధానంగానే చెప్పాలన్నారు. వాళ్ళ సొంతంగా ప్రణాళికలు వేసి నేర్పించడం కుదరదన్నారు. అయితే బైజూస్ సంస్థ కంప్యూటర్ లేదా,

లాప్ టాప్ ల ద్వారా ట్రైనింగ్ ఇస్తారని, టీచర్లు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రెండింటికి చాలా తేడా ఉందన్నారు. బైజూస్ సిబ్బంది ప్రతి స్కూల్ కి వచ్చి ప్రత్యక్షంగా నేర్పిస్తారా అని ప్రశ్నించారు.  

నేడు ఏపీ ప్రభుత్వం బైజూస్ సంస్థతో చేపట్టిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు

చదువుతున్న విద్యార్థులకు బైజూస్ యాప్ తో పాటు ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ - ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలలో 2 మ్యాగ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులు యానిమేషన్ ద్వారా చూపించడం జరుగుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam