DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరకు విస్తాడోమ్ కోచ్ కిరండూల్ వరకూ పొడిగింపు . .

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 20, 2022 (డిఎన్ఎస్):* రైలు నెంబర్ 18551 విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే రైలు కు ఉన్న విస్టాడోమ్ కోచ్ ను కిరందుల్ వరకు కొనసాగించబడుతుందని విశాఖపట్నం రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి తెలియచేసారు. ఈ బోగి ఇంతవరకు కేవలం అరకు వరకు మాత్రమే

నడుపబడుతోంది. ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్ కోస్ట్ రైల్వే విస్టాడోమ్ కోచ్ సేవలను దిగువ వివరించిన విధంగా కిరండూల్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ విస్టాడోమ్ కోచ్ అక్టోబర్ 25 2022 నుండి కిరండూల్ వరకూ నడుపబడుతుందన్నారు. తిరుగు ప్రయాణం లో ఈ విస్టాడోమ్ కోచ్ 18552 కిరండూల్-విశాఖపట్నం రైలు కు అక్టోబర్

26. 2022 నుండి అమలులోకి వస్తుందన్నారు. ఈ రైలు కు విస్టాడోమ్ కోచ్‌లు-2, స్లీపర్ క్లాస్-1, జనరల్ క్లాస్-8, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ డిసేబుల్డ్ కోచ్-1 మరియు మోటార్ కార్-1. ఉన్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam