DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో పెట్టుబడులు పెట్టేందుకు రహేజా గ్రూప్ అమర్ నాధ్ కు హామీ 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 22, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం పరిధిలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రహేజ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ తమ కార్య కలాపాలను ప్రారంభించడం కోసం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ లైజనింగ్స్) ఓ.పి . నంద కుమార్, సారధ్యంలోని బృందం  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

గుడివాడ అమరనాథ్ కు కలిసి తమ కార్యాచరణను వివరించారు. 

ఏపిలో తమ కార్య కలాపాలను విస్తరించాలని ఇందుకు విశాఖ ను కేంద్రంగా చేసుకోవాలని భావిస్తున్నా మని.రహేజ  ప్రతినిధులు తెలియ చేశారు. ఇక్కడి వాతావరణం, భూలభ్యత  తదితర అంశాలు తమకు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ఐ.టి. రంగంలో కూడా తన పెట్టబడులు పెట్టాడానికి

తాము సిద్ధంగా ఉన్నామని తెలియచేశారు

రహేజ గ్రూపునకు దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మక మాల్స్, హోటల్స్ ఉన్నాయని. అటువంటి వాటిని ఆంధ్ర ప్రదేశ్ కూడా ఏర్పాటు చేయాలని అమర్ కోరారు. అలాగే ఈ సంస్థకు చెందిన ఐ.టి. సంస్థలను విశాఖ నగరలో ఏర్పాటు చేయాలని ఇందుకు ఈ ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలను అందించడానికి అర్థం ప్రభుత్వం

సిద్ధంగా ఉందని మంత్రి అమర్ తెలియచేశారు  రహేజ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళతానని  మంత్రి  అమర్  చెప్పారు. రహేజ వంటి  ప్రముఖ సంస్థలు విశాఖ కు  వస్తున్నాయంటే, ముఖ్యమంత్రి జగన్మహన రెడ్డి  ఉత్తరాంధ్రకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత ఎక్కవగా ఉoదో అర్థం చేసుకోవచ్చని మంత్రి అమర్

అన్నారు. 

ఈ బృందం లో రెహజా సంస్థ కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శర్వణ్ కుమార్ గోనె, జనరల్ మేనేజర్ (లైజన్) బి. బాలరాజు లు ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam