DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జన్మదిన బహుమతి ఇచ్చిన జగధీశుని సేవలో తరించిన ద్రౌపది ముర్ము

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 21, 2022 (డిఎన్ఎస్):* భారత దేశ తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం భారతీయ జనతా పార్టీ ప్రకటించిన ద్రౌపది ముర్ము సోమవారం (జూన్ 20 ) తన జన్మదినం జరుపుకున్నారు. తనకు అత్యంత ఉన్నతమైన జన్మదిన బహుమతి ప్రసాదించిన పరమాత్ముని సేవించుకుని, సనాతన భారతీయ వైభవాన్ని చాటి చెప్పారు.

ఒడిశా రాష్ట్రం లోని రాయరంగ్‌పూర్ మయూర్‌భంజ్‌లోని రాయరంగపూర్‌ కు చెందిన ఆమె తన చిన్న నాటి నుంచి దర్శనం చేసుకుంటున్న శివాలయంలో స్వామికి కృతఙ్ఞతలు తెలిపేందుకు వెళ్లి, ఆలయ ప్రాంగణాన్ని చీపురుతో శుభ్రం చేసారు. ఈ దృశ్యం దేశ, విదేశాల్లో సంచలనంగా మారింది. భారత దేశానికి ఎన్నిక కాబోతున్న అభ్యర్థి ఒక సాధారణ శివాలయంలో

సేవ చెయ్యడం ఆమె అత్యంత నిరాడంబరతకు నిదర్శనం అంటూ అభినందనలు వెల్లువవుతున్నాయి. ప్రజా సేవ చేసేముందు పరమాత్ముని సేవలో తరించేందుకు ద్రౌపది కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి రావడంతో ఆలయ అర్చకులు ఆనందానికి హద్దులు లేవు. 

స్థానిక మీడియా వారు తీసి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్

అవుతున్నాయి.

ఆ తర్వాత రాష్ట్రంలోని 'జహీరా' అనే గిరిజనుల ప్రార్థనా స్థలాన్ని కూడా ఆమె సందర్శించారు.

అధికార పార్టీ అభ్యర్థిగా ఈమె పేరు ప్రకటించిన వెంటనే ఈమెను కేంద్ర సాయుధ రక్షణ బలగాల రక్షణ  సిబ్బంది ద్వారా రౌండ్-ది క్లాక్ జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. 

చిన్నతనం నుంచి సనాతన

సంప్రదాయ శిక్షణలో ఉన్న ఈమె ఉపాధ్యాయురాలుగా జీవితాన్ని ప్రారంభించి, ఎమ్మెల్యే గాను, రాష్ట్ర మంత్రిగాను, ఝార్ఖండ్ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ గాను సేవలందించారు. నేడు భారత దేశంలోని అత్యున్నత పదవిని అలంకరించేందుకు అతితక్కువ దూరంలోనే ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam