DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 న ప్రధాని చే వాణిజ్య శాఖా విదేశీ విభాగం వెబ్ పోర్టల్ నిర్యాత్ ప్రారంభం

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 22, 2022 (డిఎన్ఎస్):* వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నూతన ప్రాంగణం - ‘‘వాణిజ్య భవన్’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 23 న ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఒక కొత్త పోర్టల్ ‘‘నిర్యాత్’’ (నేశనల్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ రెకార్డ్

ఫార్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ కు సక్షిప్త రూపం ఇది) ని కూడా ఆయన ప్రారంభించనున్నారు.  భారతదేశం యొక్క విదేశీ వ్యాపారానికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని అంతటినీ సంబంధిత వర్గాల కు అందించడం కోసం ఒక వేదిక గా ఈ పోర్టల్ ను అభివృద్ధి పరచడం జరిగింది.  ఈ సందర్భం లో సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి

ప్రసంగించనున్నారు.

ఇండియా గేట్ కు సమీపం లో నిర్మించిన  వాణిజ్య భవనాన్ని శక్తి ని ఆదా చేయడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ను తీసుకొని మరీ ఈ సుస్థిర వాస్తుశాస్త్ర సూత్రాల ను అనుసరించి ఒక స్మార్ట్ బిల్డింగ్ గా తీర్చిదిద్దడం జరిగింది.    ఏకీకృతమైనటువంటి మరియు అధునాతన కార్యాలయ భవన సముదాయం గా ఇది సేవల ను

అందించనుంది.  ఈ కార్యాలయ భవన సముదాయం సేవల ను మంత్రిత్వ శాఖ పరిధి లోని రెండు విభాగాలు.. వాణిజ్య విభాగం మరియు డిపార్ట్ మెంట్ ఫార్ ప్రమోశన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) లు ఉపయోగించుకోనున్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam