DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా హంగామా, ఆమెను జైలుకు పంపాడు. .ఆ పాపం ఇతన్నిఇంటికి పంపింది 

*(DNS ఇదీ రాజకీయం: Satya Ganesh BV, Staff Reporter, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 23, 2022 (డిఎన్ఎస్):* న్యూటన్ మూడవ నియమం ఎలా అమలవుతుంది అనే ప్రశ్నకు మహారాష్ట్ర లో ఉద్దవ్ ప్రభుత్వం ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పవచ్చు. హిందూ వ్యతిరేక కాంగ్రెస్, సహా ఇతర పార్టీలతో జతకట్టి అధికారం చేపట్టిన ఉద్దవ్, హనుమాన్ చాలీసా పాడుతా అన్ని పాపానికి నవనీత్,

రవిలను జైలు కు పంపిన పాపం ఇతన్ని అధికారం పీఠం నుంచి నేరుగా ఇంటికి పంపేసింది. 

కర్ణుడి మరణానికి లక్ష కారణాలు ఉన్నాయి అన్నట్టుగా..   మహారాష్ట్ర ప్రభుత్వ పతనానికి లక్ష కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా లు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే

ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాం అన్న కారణంగా వారిద్దరిని దేశ ద్రోహం కేసులు పెట్టి 14 రోజుల పాటు  జైలు కు పంపారు. అయితే దీని పై అగ్గి మీద గుగ్గిలం అయిన హిందుత్వ వాదులు ఉద్దవ్ కు గట్టిగా గుణపాఠం చెప్పాలి అని హనుమంతుణ్ణే ప్రార్ధించారు. 

అంతకు ముందు కొరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో పూర్తి లాక్

డౌన్ అమలు లో ఉన్న కాలంలో అర్ధరాత్రి ఫాల్గట్ లో ఇద్దరు సాధువులను వందలాది ముస్లిం లు పోలీస్ స్టేషన్ ఎదురుగా అత్యంత కిరాతకంగా కొట్టి, కత్తులతో దాడి చేసి చంపిన ఘటనపై ఉద్దవ్ ప్రభుత్వం కనీసం స్పందించక పోవడం అత్యంత దారుణం. దీన్ని యావత్ హిందూ సమాజం ఉద్దవ్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసింది. ఈ పాపం ఉత్తినే పోదు,  పాలకులు

దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని శపించాయి. 

అన్నింటికంటే ప్రధానమైన విషయం హిందువులకు పూర్తి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ కి మహారాష్ట్రలో అడ్డుకట్ట వెయ్యడం కోసం బాల్ రాజ్ థాక్రే హిందువులను బలోపేతం చేసేందుకు శివసేన సంస్థ ను స్థాపించి, తదుపరి రాజకీయ పార్టీగా తయారు చేసారు. యావత్ హిందూ సమాజానికి

బాల్ థాక్రే ఒక మూల స్థంబం గా ఉండే వారు. ఈయన ఎన్నడూ కాంగ్రెస్ లేదా, ముస్లిం మద్దతు పార్టీలతో కలిసేందుకు ఇష్టపడలేదు.
అలాంటిది బాల్ థాక్రే కొడుకు ఉద్దవ్ థాకరే కేవలం అధికార దాహంతో తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర హిందూ వ్యతిరేక పార్టీలతో జత కలిసి మారాష్ట్ర అధికార పీఠం ఎక్కాడు. దీనిపైనా

సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. 

గత రెండున్నరేళ్ల ఉద్దవ్ పరిపాలన లో హిందూ వ్యతిరేక వైఖరి ని కొన్నాళ్ళు శివసైనికులు, ఆఖరికి తిరుగు బావుటా ఎగుర వేసి, మొత్తం 42 మంది ఎమ్మెల్యే తో కలిసి వేరు కుంపటి పెట్టారు. దీంతో ఉద్దవ్ తప్పని సరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగవలసిన స్థితి

వచ్చేసింది. 

విషయం పూర్తి గా గమనించిన ఉద్దవ్ ఠాక్రే వెంటనే ముఖ్యమంత్రి అధికార నివాసం ఖాళీ చేసి, తన సొంత ఇల్లు మాతోశ్రీ కి వెళ్లిపోయారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam