DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత్స్యకారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తా: జివిఎల్ 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 28, 2022 (డిఎన్ఎస్):* భారతీయ janata పార్టీ రాజ్య సభ సభ్యుడు జి వి ఎల్ నర్శింహారావు మంగళవారం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో వివిధ ప్రాంతాల లోని మత్స్యకారులను కలిసి వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్బంగా అనేక మంది మత్స్య కారులు చాలా సంవత్సరాలుగా వారు ఎదుర్కొంటున్న అనేక

సమస్యలను ఎంపి జి.వి.ఎల్ కు వివరించడం జరిగింది..అంతేకాక మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ సంఘం వారు వారి సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చి కేంద్రం నుండి సహాయం అందే విధంగా ప్రయత్నించాలని కోరారు. జి వి ఎల్ స్పందిస్తూ మొదటగా మత్స్య పరిశ్రమ అభివృద్ది కీ మొదటగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పరిచి ,దానికై ప్రత్యెక బడ్జెట్ ను

ఏర్పరిచిన ఘనత కేవలం మోడీ దేనని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్య కారులకు మార్కెట్ సదుపాయాన్ని కలగ చేసే అవకాశం ఉన్నదన్నారు. ఫిషింగ్ హార్బర్ లో పోలీసు రక్షణ సదుపాయాన్ని కలుగ చేసేందుకే ప్రయత్నిస్తానని, మత్స్యకారులకు కేంద్రం కలుగచేసి న కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని వినియోగించుకొని అభివృద్ది

చెందాలని సూచించారు. దానికై జిల్లా, కేంద్ర అధికార యంత్రాంగం తో మాట్లాడి అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే చేస్తానని జివీఎల్ తెలియచేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam