DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 1 న విశాఖ 1 టౌన్ జగన్నాధ రథయాత్ర, 2 నుంచి అవతారాలు

*విశాఖ జగన్నాధ స్వామి ఆలయంలో వైభవంగా ఏర్పాట్లు, ఈఓ ప్రసన్నలక్ష్మి* 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 29, 2022 (డిఎన్ఎస్):*న భూతొ న భవిష్యత్ అన్న రీతిలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే జగన్నాధ స్వామి రథ యాత్ర ఉత్సవాలు విశాఖ నగరంలో సైతం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా వైభవంగా

జరుగుతున్నా ఈ వేడుకల్లో  విశాఖపట్నం కొత్తరోడ్డు లో గల జగన్నాధ స్వామి ఆలయ రథ్ యాత్ర ఏంటో ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ వేడుకల్లో ప్రతి ఏటా వేలాది గా భక్దులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామి అనుగ్రహానికి పాత్రులవుతుంటారని ఆలయ ఈఓ సాధనాల ప్రసన్న లక్ష్మి తెలియచేసారు. ఉత్సవాల్లో నిర్వహించే ప్రతి రోజు అవతార vaibhavam,

కార్యక్రమాల ఏర్పాట్లను ఆమె  DNS Media కు వివరించారు.  

వార్షిక ఉత్సవాల్లో భాగంగా జులై  1 న శుక్రవారం  అత్యంత వైభవంగా ఆలయం నుంచి గుండిచా సత్రం ( సూర్య భాగ్ లోని  టర్నల్ చౌల్ట్రీ ) వరకూ భారీ రథ్ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. మరునాటి నుంచి అక్కడ ఇంద్రద్యుమ్న హాల్ లో జగన్నాధునికి రోజుకొక అవతారం లో పది

రోజుల పాటు దశావతారాలను అలంకరించి, భక్తులకు అమితానందాన్ని కల్గించడం ఆలయ వైశిష్ఠ్యంగా వస్తోంది. ఏటా వేలాది గా భక్తులు స్వామిని దర్శించుకునే భాగ్యానికి నోచుకుంటారన్నారు. 

అవతారాలు ఇవే:

1 వ రోజు జులై 2 న శనివారం  మత్సావతార అలంకారంలో జగన్నాధుడు దర్శనం ఇస్తాడన్నారు.   

2 వ రోజు  జులై 3 న

ఆదివారం జగన్నాధుడు కూర్మావతారం లో 

3 వ రోజు జులై 4 న సోమవారం  వరాహ అవతారం లోను, 

4 వ రోజు జులై 5 న మంగళవారం నృసింహ అవతారం

5 వ రోజు జులై 6 న  బుధవారం.  ఉత్సవాల్లో భాగంగా రెండు అవతారాలు ఒకే రోజు అనుగ్రహించడం విశాఖ జగన్నాథునికే ప్రత్యేకం అన్నారు. జగన్నాధుడు ఇద్దరు బ్రహ్మచారులు రూపంలో

దర్శనమిస్తాడు. వామనుడు, పరశురాముడు ఇద్దరూ అత్యంత శక్తిమంతులైన బ్రహ్మచారులుగా పురాణాలూ ప్రకటించాయి. భూమండలం పై అసమానతలు, సాధారణ జన జీవనానికి అవాంతరాలు ఏర్పడిన సందర్భాల్లో అవతరించి, మానవాళిని ఉద్దరించినవారే. 

6 వ రోజు  జులై 7 న  గురువారం రామో విగ్రహవాన్ ధర్మ. . అని శ్రీరామాయణం చెప్పినట్టుగా స్వామీ

ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామావతారం లో అనుగ్రహించనున్నాడు. 

7 వ రోజు  జులై 8 న  శుక్రవారం  రోజున ప్రజారక్షణ లో పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం లో జగన్నాధుని దర్శనం కల్పించనున్నారు. భూలోక రక్షణకై ద్వాపరయుగం లో అవతరించిన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం ఇది.  

8 వ రోజు  జులై 9 న శనివారం (దశమి

నాడు ), తదుపరి రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి రోజున కూడా రెండు  రోజుల పాటు జగన్నాధుడు శేషపాన్పు పై దర్శనం అనుగ్రహించనున్నారు. 

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సుమారు వెయ్యి మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు.  

ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీమహా విష్ణువు ( జులై 10 వ తేదీన )  యోగ నిద్రలోకి

వెళ్లే ఎంతో పవిత్రమైన రోజు కావడంతో దీన్ని శయన ఏకాదశి అని పేరు. విశాఖనగరం లోని కొత్తరోడ్డు జగన్నాధ స్వామి ఆలయంలో వార్షికోత్సవాల్లో భాగంగా ఈ శయన ఏకాదశి పర్వదినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలియచేసారు. 

ఉత్సవాల్లో ముగింపు ఘట్టం లో జులై 11 న తిరుగు రథయాత్ర చేపట్టడం

జరుగుతుంది.

రథయాత్రను స్థానిక ఎమ్మెల్యే  ప్రారంభించనున్నారు. కార్యక్రమంలోనూ, వేడుకల్లోనూ పలువురు ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam