DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యన్న వస్తే తరిమి కొట్టoడి: ప్లినరీలో మంత్రి గుడివాడ పిలుపు

*ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేనే లేదు: విశాఖ ఇంచార్జి వైవి సుబ్బారెడ్డి* 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 29, 2022 (డిఎన్ఎస్):* అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, గ్రామాల్లోకి అయ్యన్న వస్తే పార్టీ శ్రేణులు తరిమికొట్టాలని రాష్ట్ర

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు నిచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల వైసిపీ జిల్లా స్థాయి ప్లీనరీ మావేశం పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,50,000 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయిని, అందులో ఎక్కడైనా అవినీతి

జరిగిన ఆధారాలు  ఉన్నాయా? అని ప్రశ్నించారు. పేదవాడికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మేలు చేస్తే, చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లైనా కట్టించి ఇచ్చిందా?  జగన్మోహనరెడ్డి 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే కూడా చంద్ర బాబు విమర్శలు చేయడం బాధకరమని

అన్నారు...

14 ఏళ్లు సిఎంగా ఉన్నా చంద్రబాబు తన హయాంలో చెప్పుకోదగ్గ మంచి పని ఒక్కటైనా చేశారా ? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎవ్వరు ఓడించవసరం లేదని, ఆయన్ని  ఓడించడానికి లోకేష్  ఒకడు చాలని అన్నారు. 

కార్యక్రమం లో వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా

రీజనల్  కోఆర్డినేటర్  వై. వి  సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలను నెర వేర్చడమే కాకుండా ప్రజారంజక పాలన అందిస్తున్న జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి.  వ్యతిరేక ఓటు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. 

కార్యక్రమం లో అనకాపల్లి ఎంపీ డా. బివి సత్యవతి, విశాఖ మేయర్,

ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam