DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కూలిన మహారాష్ట్రలో ఉద్దవ్ ప్రభుత్వం, బల పరీక్షా చెయ్యాల్సిందే: సుప్రీం 

*బీజేపీ శిబిరంలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు శుభాకాంక్షలు వెల్లువ*

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 29, 2022 (డిఎన్ఎస్):* గత వారం రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వం తో దోబూచులాడింది ఉత్కంఠ బుధవారం రాత్రే తేలిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన పదవికి, ఎమ్మెల్సీ పదవి కూడా

రాజీనామా చేశారు. ఇతను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పడికి కేసు సుప్రీం కోర్టు కు వెళ్ళినందున గురువారం శాసన సభలో బల పరీక్ష చెయ్యవలసిందేనని తీర్పు ఇచ్చింది. అయితే బాల పరీక్షకు ముందుగానే గవర్నర్ కు నేరుగా రాజీనామా ఇచ్చే అవకాశం ఉంది. 

హిందుత్వ విధానాలకు బలిష్టమైన నేతగా ఖ్యాతి గాంచిన  శివసేన

వ్యవస్థకులు బాల్ థాక్రే వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినా  నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి బాల థాక్రే లక్ష్యాలకు వ్యతిరేకంగా కేసులు పెట్టడం, సాధువులను 400 మంది ముస్లిం మతోన్మాదులు పోలీసుల సాక్షిగా చంపితే నోరెత్తక పోవడం, హనుమాన్ చాలీసా చదువుతాం అన్న ఒక ఎంపీ, ఎమ్మెల్యే ల పై హిందువులపై దేశ ద్రోహం కేసులు పెట్టడం

యావత్ దేశ ప్రజలు సహించలేకపోయారు. దీంతో  హిందూ వ్యతిరేక పాలనా చెయ్యడంతో శివసేన లోని ఎమ్మెల్యే లు ఇతనితో విభేదించి వేరు కుంపటి పెట్టారు. గత వారం రోజులుగా ఏకేనాధ్ షిండే ధైర్యం చెయ్యడంతో అతని వెంట  49 మంది ఎమ్మెల్యే లు నడిచి ఉద్దవ్ కు గట్టిగా గుణపాఠం చెప్పారు. వీళ్లంతా ముందుగా గుజరాత్ లోని సూరత్ కు, తదుపరి గౌహతి కు

శిబిరాన్ని మార్చడం జరిగింది. బుధవారం సుప్రీం కోర్టు వాదనల నేపథ్యంలో బుధవారం రాత్రికి వీలంతా ముంబై కు చేరుకున్నారు. వారం రోజులు నడిచిన ఈ ఉత్కంఠ బుధవారం రాత్రి ఇరు వర్గాలు కోర్టు గుమ్మం తొక్కడంతో తన భవిష్యత్ తెలుసుకున్న ఉద్దవ్ ముఖ్యమంత్రి  పదవికి రాజీనామా చేసారు. 

ప్రభుత్వం మార్పుల నేపథ్యంలో ముంబై

నగరంలో భారీగా మోహరించేందుకు పొలిసు బలగాలు సిద్ధంగా ఉన్నాయి.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam