DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ లో హిందూవులకు బ్రతికే హక్కు లేదా: విహెచ్పి మండిపాటు 

*ఉదయ్ పూర్ ఘటన కు నిరసనగా విశాఖ లో భజరంగ్ దళ్ శాంతి ర్యాలీ* 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 30, 2022 (డిఎన్ఎస్):* భారత్ దేశంలో హిందువులకు జీవించే హక్కు లేదా అని విశ్వ హిందూ పరిషత్ మండిపడుతోంది. 28 జూన్ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ లో ఒక హిందూ టైలర్ సోషల్ మీడియా లో తన స్టేటస్ లో నుపూర్

శర్మ కి మద్దతుగా ఫొటోస్ పెట్టాడని, అతని దుకాణంలోకి పట్టపగలు ఇద్దరు ముస్లిం నరరూప రాక్షసులు వెళ్లి కత్తితో బహిరంగంగా మెడ కోసి, దాన్ని వీడియొ తీసి సోషల్ మీడియా పెట్టిన ఘటన కు నిరసనగా గురువారం విశాఖ నగరంలో నిరసనలు చేశారు. విశాఖపట్నం సత్యం జంక్షన్ దగ్గర బజరంగ్ దళ్ ఆధ్వర్యవంలో జరిగిన నిరసనల్లో విశ్వ హిందూ పరిషత్ విశాఖ

సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ ముస్లిం ఉగ్రవాదులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భారత దేశాన్ని తక్షణం హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. 

ఈ వీడియో లో భారత దేశ ప్రధానిని సైతం చంపుతామని హెచ్చరించగలిగారు అంటే వాళ్లకి ఈ దేశంలోని దేశ ద్రోహులు ఎంతగా సహకరిస్తున్నారో

తెలుస్తోందన్నారు.  కుహనా వాదులను, వీళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు, సంస్థలు, ఈ దేశంలో వీళ్ళకి ఆశ్రయం ఇచ్చి,  ఆర్థిక సహకారం చేస్తున్న వాళ్ళందరిని తక్షణం అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేసారు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఇలాంటి 
ముస్లిం నరరూప రాక్షసులు ఉండిఉంటారన్నారు. వాళ్ళందరిని తక్షణం

నిర్బంధించాలన్నారు. 

ఈ నిరసనల్లో విహెచ్ పి మహానగర్ అధ్యక్షులు కందర్ప విశ్వనాధం, కార్యదర్శి అప్పలరాజు, ధర్మ ప్రచార ప్రముఖ్ దుర్గాప్రసాద్ , ఇతర ప్రాంత అధికారులు పాల్గొన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam