DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్మీ క్యాంప్ పై కొండచరియలు పది ఆరుగురు మృతి 

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, జూన్  30, 2022 (డిఎన్ఎస్):* మణిపుర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోనే జిల్లాలోని తుపుల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 13 మందిని రక్షించామని, క్షతగాత్రులకు నోనే ఆర్మీ మెడికల్

యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారని,  శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఆర్మీ అధికారులు తెలియచేస్తున్నారు.  53 మంది ఈ ఘటనలో మొత్తం 53 మంది వరకు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్లడించారు.

ఈ ఘటనపై మణిపుర్ సీఎం బిరేన్ సింగ్

ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాలింపు, సహాయక చర్యల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి బలగాలు. వైద్యులతో సహా అంబులెన్సులను ఘటనా స్థలికి చేరుకున్నాయిని

తెలిపారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam