DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని మోడీ, యోగిల రాకతో అట్టహాసంగా బీజేపీ జాతీయ సమావేశాలు

*బీజేపీ జాతీయ సమావేశాలకు ఏపీ నుంచి  ఏడుగురు హాజరు* 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 02, 2022 (డిఎన్ఎస్):* భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, యావత్ భారత యువత ఆశావాది యోగి ఆదిత్యనాధ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ,  స్మృతి ఇరానీ,   తదితర

మహామహులు పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు భాగ్యనగరం లో శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొత్తం సమావేశాల్లో యోగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ రావడంతోనే సమావేశాలు ఆరంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆదివారం కూడా జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా బూత్ కు  200

మంది కార్యకర్తలను తయారు చెయ్యాలని తీర్మానం చేసారు. బూత్ స్థాయి నుంచి బీజేపీ ని మరింత బలోపేతం చెయ్యాలి అనే లక్ష్యం పై జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.  పార్టీ ఏయే రాష్ట్రాల్లో బలహీనంగా ఉందొ ఆ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నాయి. మొత్తం దేశ వ్యాప్తంగా 348 మంది ఈ సమావేశంలో

పాల్గొన్నారు. 

ఆంధ్రా నుంచి ఏడుగురు: 
ఈ భాజపా జాతీయ సమావేశాల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి కేవలం ఏడుగురు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి లభించింది. పాల్గొన్న వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ఇంచార్జి

సునీల్ దేవధర్, మాజీ మంత్రి, మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్,  ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ లు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఆతిధ్యం ఇస్తున్న తెలంగాణ రాష్ట్రం నుంచి 14 మంది పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam