DNS Media | Latest News, Breaking News And Update In Telugu

12 న సింహగిరి ప్రదక్షిణ, భారీ ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 02, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 12వతేదీన జరుగబోయే గిరిప్రదక్షన కు భక్తులకు అసౌకర్యం కలుగకుండా సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ కోసం నిర్దుష్ట ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున సింహాచలం దేవస్థానం ఇఓ ఎంవి సూర్యకళ, జివి యంసి కమిషనర్ లను ఆదేశించారు. శనివారం

వివిధ శాఖల అధికారుల తో కలిసి కలక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు  చేసిన కో ఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై  చర్చించారు 
  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కు వచ్చే భక్తులకు మార్గంలో రోడ్ల దగ్గర టెంట్లు వేసి వారికి నీడగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,  తాగునీరు ఏర్పాటు  చేయాలన్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా కార్యక్రమం చక్కగా జరిగేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. 35 కిలో మీటర్లు నడక మార్గం ఉంటుందని,  ఈ మార్గంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని,  అందుబాటులో మొబైల్ బయో టాయిలెట్లు  ఉండాలని, వాటిని శుభ్రం చేసే సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. 

సాధారణ భక్తులకు

ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జివియంసి సిబ్బందికి ఐడి కార్డులు జారీ చేయాలని, ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తారో ముందు గానే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రతి కిలో మీటర్ కు ఒక స్టాల్ ఏర్పాటు చేసి అందులో మంచినీరు, కుర్చీలు, మొబైల్ బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. 

వర్షం వచ్చే సూచనలు అధికంగా

ఉన్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లను ఉపయోగించాలన్నారు. సాధారణ భక్తులకు దర్శనం నిరంతరం గావించాలన్నారు. ఎన్ని వాహనాలు వస్తాయో అంచనా వేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ పై పోలీసులు, దేవాదాయ శాఖ సిబ్బంది సంయుక్తంగా పరిశీలించి అంచనా వేయాలని ఎసిపిని ఆదేశించారు.  సరిపడ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ

ఆర్ ఎం ను ఆదేశించారు. పోలీసు, దేవస్థానం, ఆర్టీసీ కో ఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా  ఉండాలని ఎపిఇపిడిసియల్ అధికారులకు సూచించారు.  వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపులను  ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 

జివిఎంసి అధికారులు ఎప్పటికప్పుడు దేవస్థానం వారితో

వివిధ అంశాలపై సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నడక మార్గంలో  తాగునీరు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ కు జివిఎంసి అధికారులు తెలిపారు.                                   
డిసిపి సుమిత్ సునీల్ మాట్లాడుతూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు. రోడ్లు పై వెళ్లే

వాహనాలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటునామన్నారు. జాయింట్ కమిటీ తనిఖీలు నిర్వహించి అవసరమైన ప్రదేశాల్లో రోడ్లు, లైట్లు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. 
     ప్రదక్షిణ ఏర్పాట్ల పై  ఇ ఓ సూర్యకళ మాట్లాడుతూ  ఈ నెల 12వ తేదిన జరగబోయే గిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. మొదటిగా

తొలిపవంచా దగ్గర నుంచి మొదలు పెట్టి పాదయాత్ర  మొత్తం 
35 కిమీ. మేర గిరి ప్రదక్షిణ  జరుగుతుందన్నారు.  సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా దర్శనం అనంతరం  వారిని ఉచిత బస్సుల్లో కొండ దిగువకు తరలించడం  జరుగుతుందన్నారు. భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మార్గమధ్యలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు

చేస్తామన్నారు. 
 సింహాచల క్షేత్ర పాలక మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ సమయము లో భక్తులు ఏయే ప్రాంతాల్లో ప్రధానముగా సమస్యలు ఎదుర్కొంటున్నది  తెలియజేశారు. దేవస్థానం బోర్డు సభ్యులు పలు సూచనలు చేశారు.
   ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యలు వెలగపూడి రామకృష్ణ బాబు, జీవియంసి

కమీషనర్ లక్ష్మీషా, ఆలయ స్థానాచార్యులు డా.  టి. పి రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam