DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ చౌల్ట్రీ లో వైభవంగా జగన్నాధుని కూర్మావతార దర్శనం  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జులై 03, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని ఇంద్రద్యుమ్న హాల్ ల్లో జరుగుతున్న వన్ టౌన్ కొత్తరోడ్డు లో గల శ్రీ జగన్నాధ స్వామీ ఆలయ వార్షిక ఆషాఢ మసోత్సవ అవతార దర్శనాల్లో భాగంగా రెండవ రోజైన ఆది వారం జగన్నాధుడు కూర్మావతారం లో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆలయ

ప్రధాన అర్చకులు జగన్నాధాచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం స్వామికి నిత్యారాధనలు, విశేష అలంకారాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 

దశావతార వైభవ ప్రదర్శన: . .. 

ప్రతి ఏటా వార్షిక ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన ఘట్టం దశావతార అలంకార దర్శనం.  జగన్నాధునికి రోజుకొక అవతారం లో పది రోజుల పాటు

దశావతారాలను అలంకరించి, భక్తులకు అమితానందాన్ని కల్గించడం ఆలయ వైశిష్ఠ్యంగా వస్తోంది. ఏటా వేలాది గా భక్తులు స్వామిని దర్శించుకునే భాగ్యానికి నోచుకున్నారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భక్తుల రాక ను కొంత కట్టడి చేయడం జరిగింది. అయినప్పటికీ భక్తజనం స్వామి సేవలో తరిస్తున్నారు. 

ప్రత్యేక ఆరాధనలు,

నిత్యా అర్చనలు అనంతరం ఉదయం 6 :30 గంటల నుంచి మత్సావతర అలంకారంలోని  జగన్నాధ స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. ఈ వేడుకలు జులై 3 వరకూ ఆలయంలోనే ఇదే ప్రాంగణం లో నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఉదయం 6 :30 గంటల నుంచి సాయంత్రం వరకూ దర్శనం లభిస్తుందన్నారు. 

సోమవారం జగన్నాధుడు వరాహ అవతారం లో

దర్శనమివ్వనున్నాడు. 

అవతారాలు ఇవే:

1 వ రోజు జులై 2 న శనివారం  మత్సావతార అలంకారంలో జగన్నాధుని దర్శనం లభించింది 
2 వ రోజు  జులై 3 న ఆదివారం జగన్నాధుడు కూర్మావతారం లో 
3 వ రోజు జులై 4 న సోమవారం  వరాహ అవతారం లోను, 
4 వ రోజు జులై 5 న మంగళవారం నృసింహ అవతారం
5 వ రోజు జులై 6 న  బుధవారం.

 ఉత్సవాల్లో భాగంగా రెండు అవతారాలు ఒకే రోజు అనుగ్రహించడం విశాఖ జగన్నాథునికే ప్రత్యేకం అన్నారు. జగన్నాధుడు ఇద్దరు బ్రహ్మచారులు రూపంలో దర్శనమిస్తాడు. వామనుడు, పరశురాముడు ఇద్దరూ అత్యంత శక్తిమంతులైన బ్రహ్మచారులుగా పురాణాలూ ప్రకటించాయి. భూమండలం పై అసమానతలు, సాధారణ జన జీవనానికి అవాంతరాలు ఏర్పడిన సందర్భాల్లో

అవతరించి, మానవాళిని ఉద్దరించినవారే. 
6 వ రోజు  జులై 7 న  గురువారం రామో విగ్రహవాన్ ధర్మ. . అని శ్రీరామాయణం చెప్పినట్టుగా స్వామీ ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామావతారం లో అనుగ్రహించనున్నాడు. 
7 వ రోజు  జులై 8 న  శుక్రవారం  రోజున ప్రజారక్షణ లో పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం లో జగన్నాధుని దర్శనం

కల్పించనున్నారు. భూలోక రక్షణకై ద్వాపరయుగం లో అవతరించిన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం ఇది.  
8 వ రోజు  జులై 9 న శనివారం (దశమి నాడు ), తదుపరి రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి రోజున కూడా రెండు  రోజుల పాటు జగన్నాధుడు శేషపాన్పు పై దర్శనం అనుగ్రహించనున్నారు. 
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సుమారు వెయ్యి మంది

భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు.  
ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీమహా విష్ణువు ( జులై 10 వ తేదీన )  యోగ నిద్రలోకి వెళ్లే ఎంతో పవిత్రమైన రోజు కావడంతో దీన్ని శయన ఏకాదశి అని పేరు. విశాఖనగరం లోని కొత్తరోడ్డు జగన్నాధ స్వామి ఆలయంలో వార్షికోత్సవాల్లో భాగంగా ఈ శయన ఏకాదశి పర్వదినోత్సవాన్ని అత్యంత వైభవంగా

నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలియచేసారు. 

ఉత్సవాల్లో ముగింపు ఘట్టం లో జులై 11 న తిరుగు రథయాత్ర చేపట్టడం జరుగుతుంది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam