DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెబ్బాష్ సంజయ్ సాధించావు, బహిరంగ సభలో ప్రధాని మోడీ కితాబు 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం/ భాగ్యనగరం, జులై 03, 2022 (డిఎన్ఎస్):* ప్రపంచ దేశాల నేతలు సైతం మైత్రి చెయ్యాలి అనుకునే ప్రపంచ అగ్రనేతల్లో మొట్టమొదటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనతో ఫోటోలు దిగడానికి, మాట్లాడడానికి అమెరికా అధ్యక్షుడు సైతం  తహతహలాడుతున్నారు ఆంటే  అయన వ్యక్తిత్వం అలాంటిది. 
/> ప్రపంచ దేశాలు అన్నీ పొడుగుతున్న ఆయన తిరిగి ఎదుటి వారిని పొగిడితే. . .ఆ ఆనందమే మహోన్నతమైనది. 
సరిగ్గా అదే ఆనందం ఆదివారం లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగానూ , కోట్లాదిమంది టీవీల్లో పరోక్షంగానూ చూస్తుండగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

అనుభవించారు. 

ఆదివారం బీజేపీ కేంద్ర జాతీయ కమిటీ కార్యవర్గ  సమావేశాలను భాగ్యనగరం లో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం పెరేడ్ మైదానం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.  సభకు వచ్చిన జనాన్ని చూసి, మోడీ అత్యంత ఆనందాన్ని పొంది, . . . oka ప్రక్క  సభా వేదికపై వక్తలు

మాట్లాడుతుండగానే ప్రక్కనే కూర్చున్న బండి సంజయ్ ను భుజం తట్టి మరీ  అభినందించి, సెబ్బాష్ సాధించావ్ సంజయ్ అనగానే ఒక్కసారిగా మైదానం జయ జయ ధ్వానాలతో హోరెత్తి పోయింది.

ఆ సమయంలో వేదికపై బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్,  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఆదిత్యనాధ్. ఇతర కేంద్ర మంత్రులు తదితర ఉన్నారు. వీళ్లంతా ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. 

సాక్షాత్తు భారత ప్రధాని అభినందనలు అందుకోవడంతో ఇన్నేళ్ల నుంచి బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ బీజేపీ పార్టీ లోని ప్రతి ఒక్కరూ  పడ్డ కష్టాలు, అవస్థలు అన్నీ మటుమాయం అయ్యాయి. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam