DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నూపుర్ శర్మ కేసులో సుప్రీం వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ కు మాజీ జడ్జీల లేఖ 

*117 మంది మాజీ జడ్జీలు, ఐఏఎస్లు, సైనిక అధికారుల సంతకాలతో..* 
 
*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, జులై 05, 2022 (డిఎన్ఎస్):* సుప్రీంకోర్టులో నూపుర్ శర్మ కేసును విచారిస్తున్నప్పుడు న్యాయమూర్తులు సూర్యకాంత్ & జేబీ పార్దివాలా లు బిజెపి మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ పై విచక్షణారహిత వ్యాఖ్యలను ఖండిస్తూ 117

మంది అత్యున్నత హోదాల్లో పనిచేసిన వారు సంతకం చేసిన బహిరంగ లేఖ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయాధికారి జస్టిస్ ఎన్ వి రమణకు మంగళవారం పంపారు. వీరిలో 15 మంది విశ్రాంత న్యాయమూర్తులు, 77 మంది విశ్రాంత అధికారులు, 25 మంది విశ్రాంత సైనిక అధికారులు ఉన్నారు. 

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం గత

వారం నూపుర్ శర్మ వేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ తల నరికి చంపిన ఘటనకు ఆమె బాధ్యత వహించాలని పేర్కొంది.

సంతకం చేసిన 117 మంది జాబితాలో మాజీ ప్రధాన న్యాయమూర్తి ముంబై హైకోర్టు క్షితిజ్ వ్యాస్, రాజస్థాన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్ఎస్ రాథోడ్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ

మాజీ న్యాయమూర్తి ఎంసీ గార్గ్, మాజీ డీజీపీ జార్ఖండ్ నిర్మల్ కౌర్, మణిపూర్ మాజీ డీజీపీ మిర్నాల్ కాంతి దాస్, అనుభవజ్ఞులు సంజయ్ కులకర్ణి, పీకే ఉన్నారు. రాయ్, SP సింగ్ తదితరులు ఉన్నారు. 

ఈ వ్యాఖ్యలు అందరిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam