DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 నుండి కాకినాడలో కంచి పీఠాధిపతుల చాతుర్మాస్యదీక్ష

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 05, 2022 (డిఎన్ఎస్):*భారతీయ సనాతన సంప్రదాయం పరిరక్షణలో, ప్రచారం లో ప్రధాన భూమిక వహించేవారు పీఠాధిపతులు, యతీశ్వరులు. ఏడాదిలో 8 నెలల కాలం సంచారం చేస్తూ ధర్మ రక్షణ చేయడం, తదుపరి నాలుగు నెలల కాలం తమ జ్ఞాన పరిధిని పెంచుకోవడం కోసం చాతుర్మాస్య దీక్ష చేయడం సంప్రదాయంగా

వస్తోంది.  

దానిలో భాగంగా ఒక్కో పీఠాధిపతులు ఒక్కో ప్రాంతంలో తమ దీక్షను కొనసాగిస్తుంటారు. ఈ దీక్ష సాధారణంగా ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలుకుని నాలుగు నెలల కాలం సాగుతుంది. ఆంధ్ర ప్రాంత వాసుల భాగ్యవసాన ఈ ఏడాది కాకినాడ ప్రాంతంలో తమ చాతుర్మాస్య దీక్ష నిర్వహించాలి అని కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠ 70 వ

పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహించారు. 

వేదిక : 
చాతుర్మాస్యదీక్ష ను  కాకినాడ నగర శివారు తిమ్మాపురం గ్రామపరిధిలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ఈనెల 13 నుండి 60 రోజుల పాటు కొనసాగనుంది. పీఠాధిపతులు ఈ నెల 9 వ తేదీన కాకినాడ విచ్ఛేయనున్నారు. స్వామికి అత్యంత వైభవంగా స్వగతం పలికేందుకు

నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అచ్చంపేట జంక్షన్, ఏడిబి రోడ్ లోని నన్నయ్య వర్సిటీ పి జి సెంటర్ నుండి స్వామివారికి భారీ ఎత్తున సువాసినులు, కన్యలు, భజన, వివిధ కళాజాతరలు  భక్తజనులతో ఘనస్వాగతంతో ఊరేగింపుగా గోశాలకు చేరుకుంటారు. 

ప్రతిరోజూ త్రిపురసుందరి ( కామకోటి ) సహిత చంద్రమౌళీశ్వరారాధన ఉంటుందని, అదే

సమయం లో అద్వైతసభ, అగ్నిహోత్రుల సదస్సు, జ్యోతిష సదస్సు జరుగుతాయన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు దీప పూజ, సంగీత, వాద్య, నృత్య, భజనాది  సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహిస్తారని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam