DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాళీ పై తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు, పోలీస్ కేసులు

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 06, 2022 (డిఎన్ఎస్):* కోట్లాది మంది హిందువులు ఆరాధించే కాళీ మాత ను కించపరుస్తూ నిర్మించిన లఘు వీడియో పై హిందూ సమాజం మండిపడి నిరశన గళం వినిపించింది. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఇదే  సమయంలో ఆ లఘు వీడియో ను పూర్తిగా సమర్థిస్తూ త్రిణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ మహువా

మావోయిత్రా కాళీ ని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఒక టీవీ ప్రోగ్రాం లో అత్యంత నీచంగా వ్యాఖ్యానించడం పై దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలయ్యింది. భారత చట్టసభలో ఒక సభ్యురాలిగా ఉండి, భాద్యతగా ఉండవలసిన వ్యక్తి పూర్తిగా భాద్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె పార్టీ కూడా  తప్పు పట్టింది. 
పైగా ఇదే వ్యక్తి అదే షో లో నుపుర్ శర్మ

ను తప్పు పట్టింది, తానూ చేసింది చాలా కరెక్ట్ అంటూ తనకి తానూ కితాబు ఇచేసుకుంది. మీ వ్యాఖ్యలపై నిరసనలు వస్తే ఏమి చేస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా హేళనగా ఎవ్వడికి జడిసేది లేదు .  మహువా మొయిత్రా  సమాధానం చెప్పింది. 
మంగళవారం జరిగిన ఈ టీవీ షో ప్రసారం అనంతరం దేశవ్యాప్తంగా మహువా దిష్టిబొమ్మలు  తగలబెట్టడం,

ఆమె ను తక్షణం అరెస్ట్ చెయ్యాలని వివిధ రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. మధ్యప్రదేశ్  ప్రభుత్వం ఈమె  వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయ్యింది.

పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నేత సుబెందు అధికారి సారధ్యంలో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు కొలకత్తా రోడ్లపై నిరసనలు చేసారు. 

అయోధ్య కు చెందిన

సంత్ రాజు దాస్ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కోట్లాదిమంది పూజించే కాళీమాతను కించపరిచిన మహువా కు హిందువులు కూడా ఫత్వా జారీచేస్తే ఎలా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే హిందూ ధర్మం లో ఇలాంటి ఉద్రిక్త చర్యలు ఉండవని, ఈ దేశ చట్టాలను పూర్తిగా గౌరవిస్తామన్నారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam