DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతదేశ శిఖరాగ్రం శ్రీనగర్ లో శాంతిమూర్తి భగవద్రామానుజ విగ్రహావిష్కరణ 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 07, 2022 (డిఎన్ఎస్):* భక్తి మార్గాన్ని విశ్వవ్యాప్తం చేసిన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్నీ అఖండ భారతావని శిఖరాగ్రమైన కాశ్మీర్ లోని శ్రీనగర్ లో భారత దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. గురువారం వర్చ్యువల్ విధానం లో శ్రీనగర్‌లోని సోన్వార్ ప్రాంతంలోని

ఆలయంలో ఉన్న స్వామి రామానుజాచార్య శాంతి మూర్తి విగ్రహం ను ఆయన ప్రారంభించారు. కర్ణాటక లోని మేల్కొటై కు చెందిన యదుగిరి యతిరాజ మఠం 41 వ పీఠాధిపతులు యదుగిరి యతిరాజా నారాయణ జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం లో స్వామిజి మాట్లాడుతూ భగవద్రామానుజులు దక్షిణాది లో జన్మించినప్పడికి యావత్ భారతావని లో విస్తృతంగా

పర్యటించి ఎన్నో సంఘ సంస్కరణలు చేపట్టారన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఇంతవరకు 108 దివ్య దేశాలు ఉన్నాయని,  ఈ శ్రీనగర్ లో రామానుజ విగ్రహ ప్రతిష్ఠతో 109 వ దివ్యదేశం ఏర్పడిందన్నారు. అత్యంత ప్రఖ్యాతి గాంచిన శ్రీనగర్ ప్రాంతంలోనే భాగద్రామానుజులు శ్రీభాష్యం రచన చేసారని, సరస్వతి అమ్మవారిచే భాష్యకారులుగా

పిలువబడ్డారన్నారు. అందరికి దేవాలయ ప్రవేశం కల్పించాలని, నిషేంధించబడిన సమాజ ప్రతినిధులను స్వయంగా ఆలయ ప్రవేశం చేయించి సంచలనం సృష్టించారన్నారు. విగ్రహ ప్రతిష్ట జరిగింది కాశ్మీర్ రాష్ట్రంలో అయితే, ఈ సందర్బంగా పాల్గొన్న ప్రముఖుల్లో ముఖ్య అతిధి దేశ హోమ్ శాఖా మంత్రి అమిత్ షా గుజరాత్ కు చెందిన వారని, తమ పీఠం కర్ణాటక

రాష్ట్ర సంబంధం ఉన్నాడని, విశిష్ట అతిధి జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారు కావడంతో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో అనుబంధం ఏర్పడిందన్నారు.      

ముఖ్య అతిధి గా వర్చ్యువల్ విధానం లో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖా  మంత్రి అమిత్ షా మాట్లాడుతూ తాము కూడా శ్రీవైష్ణవ ( మధ్వ )

సంప్రదాయం లోని వారమేనని, రామానుజాచార్య స్వామి విగ్రహావిష్కరణ చేయడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. వచ్చే సంవత్సరం గుజరాత్ లో కూడా భగవద్రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ షా మాట్లాడుతూ, “ఇది కాశ్మీర్‌లోనే కాదు, దేశం మొత్తానికి శాంతి సందేశం ఇస్తుందని..

గుజరాత్ ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించనుందని అన్నారు.

ఈ విగ్రహం జమ్మూ, కాశ్మీర్  ప్రాంతంలో మరింత శాంతి శ్రేయస్సును తెస్తుందని హోం మంత్రి అన్నారు.

జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కర్ణాటక ఉన్నత విద్య శాఖా మంత్రి డా. సి. ఎన్ . అశ్వత్ నారాయణ్ ,

బెంగుళూరు దక్షిణ ఎంపీ, భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam