DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమర్ నాధ్ యాత్రకు అతివృష్టి వర్ష విపత్తు, పలువురు మృత్యువాత

*(DNS Report: Sairam CVS, రాష్ట్ర వాది పత్రకార్, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 08, 2022 (డిఎన్ఎస్):* అత్యంత కష్టతరమైన అమర్ నాధ్ యాత్రకు అతివృష్టి వర్షం విపత్తుగా మారి ఆటంకం కల్గించడంతో పలువురు భక్తులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఇంకెందరో చెల్లాచెదురు అయ్యారు. గత నెల 30 న మొదలైన అమర్ నాధ్ యాత్రకు అన్ని కట్టుదిట్టమైన చర్యలు

తీసుకున్నా. . .వర్షం రూపంలో విపత్తు ఏర్పడింది. దక్షిణ కశ్మీర్‌ ప్రాంతంలోని అమర్‌నాథ్‌  గుహ లో వెలుగొందిన అమరనాధ స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు ఏటా ఎంతో  క్లిష్టమైన ఈ అమర్ నాధ్ యాత్రను చేస్తుంటారు. కొరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా స్వామి దర్శనం లభించక పోవడంతో ఈ ఏడాది మొదటి రోజు నుంచే

భారీ సంఖ్యలో భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

శుక్రవారం సాయంత్రం సాయం‍త్రం 5.30గం. నుంచి కుంభవృష్టి మొదలైంది. భోలేనాథ్‌ గుహ సమీపంలోనే మొదలైన వర్షం కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి పలువురు

కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. 

ఆకస్మిక వరద ఉదృతికి యాత్రికుల టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయి. పలువురు వరదల్లో కొట్టుకుపోగా.. ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే చాలా మంది కనిపించకుండా పోవడంతో

వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam