DNS Media | Latest News, Breaking News And Update In Telugu

షరియా చట్టాలు కోరే వాళ్లకి భారత్ లో చోటు లేదు: హిందూ సంకల్ప్ యాత్ర హెచ్చరిక

*లక్షలాది మందితో ఢిల్లీ లో హోరెత్తిన విహెచ్పి భారీ నిరసన ర్యాలీ*  

*హనుమాన్ చాలీసా పారాయణతో మారుమ్రోగిన దేశ రాజధాని వీధులు* 

*మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ  రోడ్లన్నీ కాషాయ మయం*

*(DNS Report: Sairam CVS, राष्ट्र वादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 09, 2022 (డిఎన్ఎస్):* షరియా చట్టాలు అమలు

కోరుకునే వాళ్లకి సనాతన భారత్ దేశంలో చోటు లేదని హిందూ సంఘటన్ ప్రకటించింది. శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీ లో మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ లక్షలాది మంది హిందూ సమాజం ప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 5 కిలోమీటల దూరం హిందూ భక్తులతో నిండిపోయింది. జన సముద్రంగా మారిన దేశ రాజధాని. వాహనాలు ప్రవేశించే మార్గం

లేకపోవడం  ప్రధాన వేదిక కు చేరుకోవాల్సిన ముఖ్య వక్తలు కూడా వాహనాలు వదిలి పెట్టి, ర్యాలీతో పాటు నడుచుకుంటే వెళ్లడం గమనార్హం.  దేశ రాజధాని వీధులన్నీ హనుమాన్ చాలీసా పారాయణతో మారు మ్రోగి పోయాయి. వీధుల్లో మైక్ లు అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ చాలీసా సుమారు రెండు గంటల సమయం పఠిస్తూనే ఉన్నారు.  

ముందుగా 50 వేల మంది

హిందువులతో భారీ గా శాంతియుత నిరసన చేద్దామని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ లు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల నుంచి భారీ గా స్పందించి లక్షల సంఖ్యలో హిందూ ప్రతినిధులు ఢిల్లీ కి చేరుకున్నారు. 

కేవలం హిందూ సమాజం నుంచి ప్రతినిధులు మాత్రమే ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల

ప్రతినిధులు హాజరు కాకపోవడం గమనార్హం. పూర్తిగా హిందూ ధర్మ ప్రచార సంఘాలు, సాదు సంత్ సమ్మేళనాల నుంచి భక్తులు మాత్రమే ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, సహా 10 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అలోక్ కుమార్ మాట్లాడుతూ ఈ దేశంలో

ప్రజలు శాంతియుతంగా జీవనం సాగించాలని పిలుపు నీచమని, అయితే ఈ దేశాన్ని నాశనం చెయ్యాలని దేశ విద్రోహ శక్తులు షరియా చట్టాలను అమలు చెయ్యాలని పిలుపు ఇస్తున్న వాళ్ళని భారతీయ చట్టాల ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. మహారాష్ట్ర లోను,రాజస్థాన్ లోను, ఇతర ప్రాంతాల్లోనూ షరియత్ చట్టం అమలు చెయ్యాలంటూ కొందరు మసీదుల

నుంచి ఇచ్చిన శర్ తన్ సే జూదా  పిలుపు ను పూర్తిగా ఖండించారు. 

భారతీయ జనతా పార్టీ యువనాయకులు కపిల్ మిశ్రా మాట్లాడుతూ భారత దేశం లో విద్రోహం చేసేందుకు షరియా చట్టాలతో దేశ విద్రోహులు రోడ్డెక్కితే. . .అఖండ భారత్ ను రక్షించుకోడానికి భారత దేశ భక్తులు కూడా రోడ్డెక్కుతారని హెచ్చరించారు. 

హిందూ శక్తి

చైతన్యం కల్గించేందుకు జరుగుతున్నా ఈ ర్యాలీ సందేశాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరింపచేస్తామన్నారు. ఇకపై హిందూ వ్యతిరేక శక్తులు మూటాముల్లె సర్దుకోవాలని హెచ్చరించారు.  

భజరంగ్ దళ్ యువకులు మాట్లాడుతూ ఈ దేశం కేవలం హిందూ సమాజం కోసమే ఉందని, ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.

హిందువులు ఉన్న చోట ఇతర మతాలవారు సుఖ జీవనం చేయగలరని, అయితే షరియా చట్టాలు అమలు చేసే తీవ్రవాద శక్తులు ఉన్నచోట హిందువుల ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో, ఉప్పుడు పోతాయో తెలియాడన్నారు. 

ఈ ర్యాలీలో పాల్గొన్న సాధారణ గృహిణులు మాట్లాడుతూ రాక్షస చట్టాలు అమలు కోరుకునే వాళ్ళని ఈ దేశం పోషించవలసి అవసరం లేదని, ఈ దేశం వదిలి

పోవాలని డిమాండ్ చేసారు. సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ శాంతి శౌఖ్యలతో బ్రతకాలన్నారు. 

హిందూ శక్తి కి సంఘీభావం ప్రకటించేందుకు తాము ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ కి ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు వచ్చామన్నారు. 

ఈ ర్యాలీ లో ముందుగా సాదు సంత్ లు, యువకులు, మహిళలు, పిల్లలు, వేలాదిమంది కాషాయ జండాలతో పాటు,

భారతీయ జాతీయ జండాలు పట్టుకుని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam