DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెంగుళూరులో యదుగిరి యతిరాజ జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్ష 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 10, 2022 (డిఎన్ఎస్):* మేల్కొటై లోని శ్రీ యదుగిరి యతిరాజ మఠాధిపతులు యతిరాజ జీయర్ స్వామి వారి ఎనిమిదవ (అష్టమ) చాతుర్మాస దీక్షను బెంగుళూరు మహానగరం లో నిర్వహించనున్నారు. 
జగదాచార్యులు భగవద్రామానుజాచార్య స్వామి చే స్థాపించబడినదే శ్రీ యదుగిరి

యతిరాజ మఠం. శ్రీ తిరునారాయణ దేవాలయం యొక్క సేవలు మరియు నియంత్రణ కోసం తమ ఆచార్యులు అళవందార్ (యమునాచార్య) నుండి స్వీకరించిన ఆదేశాలతో ఈ మఠాన్ని స్థాపించారు. శ్రీవైష్ణవ సంప్రదాయం లో అత్యంత ప్రాధాన్యత కల్గిన పీఠాల్లో ఇది కూడా ఒకటి. 

స్వామివారు ఇటీవలే భారత దేశ మకుటాయమానమైన కాశ్మీర రాష్ట్రం లోని శ్రీనగర్

యాత్ర భవన్ లో భగవద్రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠా కావించారు. ఈ కార్యక్రమానికి దేశ హోమ్ శాఖా మంత్రి అమిత్ షా వర్చ్యువల్ విధానంలో పాల్గొన్నారు. 

శ్రీ శ్రీ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున ( జులై 13 న ) 
పురస్కరించుకుని పూర్వాషాఢ మాసంలో అష్టమ చాతుర్మాస్య

సంకల్పాన్ని బెంగుళూరు లోని నెరేవన్ గల తమ పీఠంలో జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్షను స్వీకరించనున్నారు.  స్వామి వారి మరియు తిరునక్షత్ర మహోత్సవం కూడా నిర్వహించనున్నారు. 

ప్రతి రోజు శ్రీ మఠంలో నిత్యం తిరువారాధన, భాగవత తదీయారాధన, దివ్యప్రబంధ సంత, కాలక్షేప ఉపన్యాసాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. శ్రీ మఠంలోని

శిష్యులకు, భక్తులకు మరియు అన్ని వర్గాల వారికి ఆచార్య శ్రీరామానుజుల దివ్య సందేశాన్ని వ్యాప్తి చేస్తూ నిరంతరం పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీ మఠంలో ప్రతిరోజూ కచేరీ, వేదపారాయణం, గ్రంథపారాయణం, గ్రంథ కాలక్షేపం, రామాయణ పారాయణం, ఉపన్యాసాలు, సంగీత, గమకవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 



చాతుర్మాస్య సందర్భంగా, శ్రీ శ్రీ యతిరాజ జీయర్ యొక్క 73వ తిరునక్షత్ర మహోత్సవం 28వ తేదీ ఆగస్టు  2022 ఆదివారం అవని మాస ( సింహమాస ) పూర్వాఫాల్గుణి నక్షత్రంలో నిర్వహించబడుతోంది.  ఈ మహోత్సవంలో శ్రీ మఠం విద్యార్థులు మరియు భక్తులు చురుకుగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. 

కార్యక్రమం 

జులై 13 న

చాతుర్మాస్య దీక్ష సందర్బంగా  ఉదయం 10-00 గంటల నుండి – మృత్తిక సేకరణ, పంచశాంతి పారాయణ, కచేరీ, శాతుమోర్, శ్రీపాద తీర్థం, తదీయారాధన అందిస్తున్నారు. 

స్వామి వారి తిరునక్షత్రం సందర్భంగా  తేది 28 న ఆదివారం ఉదయం 9-00 గంటలకు దివ్య ప్రబంధ  పారాయణం, వేదపారాయణం, కచేరీ, శాతుమొరై, శ్రీపాద తీర్థం, తదీయారాధన

అందిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam