DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*సింహాచలం గిరి ప్రదక్షిణ కు ఏర్పట్లు పూర్తి: కలెక్టర్, ఆలయ ఈఓ*

*12 న మధ్యాహ్నం 3 గంటలకు తోలి పావంచా నుంచి ప్రారంభం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 11, 2022 (డిఎన్ఎస్):* శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం సింహాచల క్షేత్రం లో ఆషాఢ (గిరి ) పొర్ణమి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయినట్టు జిల్లా కెలక్టర్ డా. ఏ. మల్లిఖార్జున, ఆలయ ఈవో సూర్యకళ

మీడియా సమావేశంలో ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లపై మాట్లాడారు. 

ముందుగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 12 తారీకున గిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ దిగువ కొండ వద్ద గల తోలి పావంచా నుంచి వద్ద స్వామీ వారి రధం ప్రారంభమవుతుంది. దీంతో యాత్ర మొదలవుతుందన్నారు. సుమారు 32 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన గిరి తిరిగి  సింహగిరి తోలి

పావంచా కు చేరుకుంటారన్నారు. సుమారు 10 లక్షల మంది భక్తుల వరకు గిరిప్రదక్షిణ లో పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. కొండ పైకి స్వామి దర్శనం కోసం వచ్చేవారు భక్తుల సంఖ్య రెండు లక్షల వరకు వస్తారని అంచనా ఉందన్నారు. భక్తుల నడక మార్గంలో మంచినీరు, ప్రసాదాలు, టాయిలెట్స్, ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 32

కిలోమీటర్లు నడిచి వచ్చిన భక్తులు మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకోవడానికి మాత్రమే అనుమతి నిస్తున్నామన్నారు. దర్శనం అనంతరం తిరిగి క్రిందకు వచ్చే భక్తులు బస్సులలో మాత్రమే వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు.

అదేవిధంగా సింహగిరిపైన కూడా స్వామివారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దేవస్థానం

బస్సులు ఉచితంగా నడుపుతున్నామని, భక్తుల సౌకర్యార్థం 295 టాయిలెట్స్ తో పాటు, 10 మెడికల్ క్యాంప్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగిన సింహగిరి దిగువ బస్టాండు నందు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామని ఈవో సూర్యకళ తెలిపారు. 13 తారీకు బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు సుప్రభాత సేవ అనంతరం

భక్తులకు దర్శనం చేసుకోవచ్చన్నారు. బుధవారం నాడు విఐపి బ్రేక్ దర్శనాలు అంతరాయ దర్శనాలు నిలుపుదల చేస్తున్నామన్నారు. 

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ సింహచలం గిరి ప్రదర్శన కు సుమారు 5 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సుమారు రూ. 17 లక్షల ఖర్చు తో లైటింగ్, మెట్ల మార్గం సౌకర్యాలు

కల్పిస్తున్నామన్నారు. 32 కిమీ పరిధి లో 30 స్టాల్స్ ఎర్పాటు త్రాగు నీరు, టాయ్లెట్ లు, కూర్చోవడానికి వెసులు బాటు కల్పిస్తున్నామన్నారు. దీనిలో 40 కి పైగా స్వచ్ఛంధ సంస్థలు సహాయం లో పాల్గొంటున్నాయన్నారు.  2.5 లక్షల లీటర్ లు నీళ్లు జీవీఎంసీ  నుంచి సహకారం ఉందన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ కూడ ఎర్పాటు చేశామన్నారు. వాతావరణం

అనుకూలంగా లేని కారణంగా భక్తులు నడక మార్గంలో తగిన జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. దీనిలో సచివాలయం, ఎండోమెంట్, జీవీఎంసీ, రెవెన్యూ ఎంప్లాయిస్ బాగా స్వామ్యం ఉందన్నారు. అప్పుగార్ దగ్గర స్నానాలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసామన్నారు. 30 మంది  గజ ఈత గాళ్ళు, బోట్ లు ఎర్పాటు ఉందన్నారు. మార్గమధ్యలో మెడికల్ కాంప్ లు 30 ఎర్పాటు

చేసామన్నారు. మొత్తం 4000  మంది శానిటరీ సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. 

పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మొత్తం 2016 మంది పోలీసు పాల్గొంటున్నారని, 1560, టాఫిక్ సిబ్బంది, 106 క్రైం, sdrf 3 టీమ్స్, మెరైన్ పోలీసు కూడ  విధుల్లో ఉన్నారన్నారు. సొంత్యం, గోశాల నుండీ వాహనాల కి అనుమతి లేదన్నారు. విస్తృత ఏర్పాట్లు,

పార్కింగ్ ప్లేస్ లు కూడ చెప్పామన్నారు. సర్వీస్ రోడ్ లో అంబులెన్స్ ల కు, హనుమంత వాక నుండి జోడు గుళ్ల పాలెం వరకు స్టాల్స్ కీ అనుమతి లేదన్నారు. జోడు గుళ్ల పాలెం వద్ద సముద్రం ఉదృతం కనుక స్నాన లకు అనుమతి లేదన్నారు., జాగ్రత లు తీసుకుంటూ పోలీస్ కి సహక రించాలని కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam