DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 న చెస్ గ్రాండ్ మాస్టర్ తో ఆడే విశాఖ క్రీడాకారులు వీరే 

*(DNS Report: Sairam CVS, రాష్ట్ర వాది పత్రకార్, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 14, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 17 న జరుగనున్న 44 వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే కార్యక్రమం లో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా చదరంగం లో గ్రాండ్ మాస్టర్ విశాఖ పట్నం క్రీడాకారులతో ఒకేసారి చదరంగం ఆడనున్నట్టు విశాఖపట్నం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య క్రీడా

శిక్షకులు ఎన్ . సూర్యారావు తెలిపారు. విశాఖ క్రీడాకారుల ఎంపిక గురువారం  ఈ నెల 14 న పోటీలు నిర్వహింఛామన్నారు.  
బాలుర విభాగం లో 1. వాసిరెడ్డి అర్జున్, 2. కన్నూరు అనంత్ కుమార్, 3. సబ్బి సాశ్విక      
బాలికల విభాగం లో  1 కుమారి ప్రసాద్ జాగృతి, 2. శ్రావ్యశ్రీ భీమార శెట్టి, 3. ముస్కాన్ పట్టాన 
గెలుపొందినట్టు విశాఖపట్నం

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ముఖ్య క్రీడా శిక్షకులు ఎన్ . సూర్యారావు తెలిపారు.  

ప్రపంచములోనే మొట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న ఒలింపియాడ్ టార్చ్ రిలే కార్యక్రమం లో భాగంగా ముందస్తుగా ఈ నెల 14 న నెహ్రు యువకేంద్ర యూత్ హాస్టల్, విశాఖపట్నం నందు జిల్లా చెస్ పోటీలు నిర్వాహిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్ర

ప్రదేశ్ లో గుర్తింపు కలిగిన ప్రదేశాలలో జిల్లా, రాష్ట్ర చెస్ అసోసియేషన్,  యువకేంద్ర సమన్వయంతో ఈ పోటీలు జరుగుతాయన్నారు. 

14 న విశాఖపట్నం లో జరిగే పోటీలలో గెలుపొందిన వారితో గ్రాండ్ మాస్టర్ తేది 17.07. 2022 న స్వర్ణభారతి ఇన్డోర్ స్టేడియం నందు ఏకకాలం లో చెస్ ఆడుతారన్నారు. 

ఒలింపియాడ్ టార్చ్ రిలే

కార్యక్రమం ఈ నెల 17 న ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ లోను, విశాఖపట్టణం లోను, 23 న తిరుపతి జిల్లాలోని తిరుపతి వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam