DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్యోతి ప్రజ్వలనతో పాదరక్షలు ధరించవద్దు: పాలకులకు విహెచ్పి సూచన

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 16, 2022 (డిఎన్ఎస్):* ప్రభుత్వం లోని పెద్దలు, అధికారులు అధికారిక కార్యక్రమాల్లో  హిందూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు అభినందనలు తెలియచేస్తూ, జ్యోతి ప్రజ్వలనతో పాదరక్షలు ధరించవద్దని విశ్వహిందూ పరిషత్  విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి

పూడిపెద్ది శర్మ సూచించారు. శనివారం సాగరతీరంలోని ఓ రిసార్ట్ లో జరిగిన కార్యక్రమం లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలు, నైపుణ్యం, విద్య, శిక్షణ, గనులు, ఖనిజాలు, తయారీ రంగాల్లో పరస్పర సహకారం కొన్ని ప్రాజెక్ట్ ల ఒప్పందాలు చేపట్టింది. 
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో హిందూ

సంప్రదాయం ప్రకారం జ్యోతి ప్రజ్వలన చేపట్టారు. దీనిలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, గుడివాడ అమర్ నాధ్, జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లిఖార్జున, పరిశ్రమల అధికారి డా. సృజన తదితరులతో పాటు వెస్టర్న్ ఆస్ట్రేలియా అధికారులు పాల్గొన్నారు. వీరిలో కొందరు కాళ్లకు పాదరక్షలు ధరించి జ్యోతి వెలిగించడం పై విశ్వ హిందూ పరిషత్

తప్పు పట్టింది. హిందూ సంప్రదాయం లో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉందని, పాదరక్షలు ధరించి పాల్గొంటే కించపరిచినట్టేనన్నారు. ఇకపై సంప్రదాయం పాటించే సమయంలో చిన్న పొరపాట్లు సవరించుకోవాలని, జ్యోతి ప్రజ్వలన చేసే సమయంలో పాదరక్షలు తీసి పాల్గొనాలని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam